విజయవాడ ఎంపీ టికెట్ అంటే ప్రస్తుతం ఒక హాట్ సీట్ లెక్క. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నా విజయవాడ లెక్కవేరే అంటున్నారు వైసీపీ నాయకు లు. దీనిని ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు. గత ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కొన్నాళ్లు ప్రభుత్వకార్యక్రమాల్లో హల్చల్ చేసినా తర్వాత ఆయన వ్యాపారాలు, వ్యవహారా్ల్లోనే ఉంటున్నారు. దీంతో ఈ సీటును ఆయనకే కేటాయిస్తారా? లేక ఎవరికైనా ఇస్తారా? అనే చర్చజరుగుతోంది. అయితే, దీనిపై వైసీపీ అధిష్టానం మౌనంగా ఉంది.
దీనికి కారణం ఏంటనేది ఇంకా తెలియక పోయినా ఒక విషయం చర్చకు వస్తోంది. రాజకీయంగా ఉన్న వ్యూహాల నేపథ్యంలో ఈ టికెట్ను వదులుకు నేందుకు వైసీపీ సిద్ధపడుతోందనే చర్చ సాగుతోంది. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నిజమన్నట్టుగా వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నిక ల నాటికి ఈ టికెట్నుంచి బీజేపీ పోటీ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ కేశినేని నానికి కనుక టీడీపీలో టికెట్ దక్కకపోతే ఆయన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని కొన్నాళ్లుగా విజయవాడలో చర్చసాగుతోంది.
అయితే, దీనిపై ఇంకా క్లారిటీ లేకపోయినా, రాజకీయంగా ఆయన తమ్ముడు పుంజుకోవడం, టీడీపీ నేతలు ఆయనకు జైజేలు కొట్టడం వంటివి ఇక్కడ హాట్ పుట్టిస్తున్నాయి. దీంతో ఏదైనా జరగొచ్చు అనే చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే.. దీనిని శాక్రిఫైజ్ చేసేందుకు వైసీపీ రెడీగా ఉందని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందని కూడా కొందరు సీనియర్లే అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా రాజకీయంగా విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోవైపు, కేశినేని నాని వైఖరితో విసిగిపోయిన టీడీపీ ఆయనను తప్పించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి ఈ సీటు ఇచ్చేందుకు చూస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, కేశినేనిని గుంటూరుకు పంపిస్తారని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా రాజకీయంగా విజయవాడ ఎంపీ హాట్ టాపిక్ అయింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 2, 2022 7:10 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…