గడిచిన కొద్ది నెలలుగా కరోనా కారణంగా అతలాతకులమైపోతున్న వేళ.. చాలా పనులకు ఇబ్బందికరంగా మారింది. ఇంట్లోనే ఉండాల్సి రావటం.. బయటకు వస్తే వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పలు వ్యవస్థలు పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పలు రంగాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అలాంటి నిర్ణయమే ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా ప్రబలిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకోవాలన్న సూచనను సుప్రీం చేసింది. కోర్టు సమన్లు.. నోటీసులు.. ఈ మొయిళ్లు.. ఫ్యాక్స్ తదితరాలను వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే.. జస్టిస్ ఆర్.సుబాషణ్ రెడ్డి.. జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాల్ని జారీ చేసింది. కరోనా వేళ.. కక్షిదారులు.. న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి చిక్కుల్ని తప్పించేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించటం ద్వారా.. చాలా సమస్యలకు పరిష్కారంగా మారుతుందని భావిస్తున్నారు.
కరోనానేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల అంశాన్ని సుమోటోగా విచారించిన సుప్రీం ధర్మాసనం.. తాజాగా వాట్సాప్ ద్వారాసమాచారాన్ని.. నోటీసుల్నిపంపొచ్చన్న నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. కేసులవిచారణలో జాప్యాన్ని తగ్గించే వీలుంటుందని చెబుతున్నారు.
This post was last modified on July 11, 2020 11:51 am
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…