గడిచిన కొద్ది నెలలుగా కరోనా కారణంగా అతలాతకులమైపోతున్న వేళ.. చాలా పనులకు ఇబ్బందికరంగా మారింది. ఇంట్లోనే ఉండాల్సి రావటం.. బయటకు వస్తే వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పలు వ్యవస్థలు పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పలు రంగాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అలాంటి నిర్ణయమే ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా ప్రబలిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకోవాలన్న సూచనను సుప్రీం చేసింది. కోర్టు సమన్లు.. నోటీసులు.. ఈ మొయిళ్లు.. ఫ్యాక్స్ తదితరాలను వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే.. జస్టిస్ ఆర్.సుబాషణ్ రెడ్డి.. జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాల్ని జారీ చేసింది. కరోనా వేళ.. కక్షిదారులు.. న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి చిక్కుల్ని తప్పించేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించటం ద్వారా.. చాలా సమస్యలకు పరిష్కారంగా మారుతుందని భావిస్తున్నారు.
కరోనానేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల అంశాన్ని సుమోటోగా విచారించిన సుప్రీం ధర్మాసనం.. తాజాగా వాట్సాప్ ద్వారాసమాచారాన్ని.. నోటీసుల్నిపంపొచ్చన్న నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. కేసులవిచారణలో జాప్యాన్ని తగ్గించే వీలుంటుందని చెబుతున్నారు.
This post was last modified on July 11, 2020 11:51 am
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…