Political News

పైన మోడీ.. ఇక్కడో బోడి.. మధ్యలో ఈడీ

మాటకారితనంలో, ప్రత్యర్థుల మీద పంచులు వేయడం, పదునైన విమర్శలు గుప్పించడంలో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా ఎప్పుడో రుజువు చేసుకున్నాడు కేటీఆర్. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆయన ఆయన తన మాటల పదును మరోసారి చూపించారు. టీవీ9 స్టూడియోలో కూర్చుని ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రత్యర్థులపైకి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ఒక కామెంట్ వైరల్ అయింది. ‘మోడీ బోడీ ఈడీ’ అంటూ రైమింగ్‌తో ఆయన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసిన విధానం టీఆర్ఎష్ శ్రేణులకు, బీజేపీ వ్యతిరేకులకు భలే కిక్కు ఇస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మీదికి సీబీఐ, ఈడీలను వదిలి వారిని దారిలోకి తెచ్చుకోవడం మోడీ సర్కారుకు అలవాటుగా మారిన నేపథ్యంలో మీపైకి వాటిని ప్రయోగిస్తే మీరేం చేస్తారు అని న్యూస్ ప్రెజెంటర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ ఈ కామెంట్ చేశారు.

“పైనో మోడీ.. ఇక్కడో బోడి (బండి సంజయ్‌ని ఉద్దేశించి).. మధ్యలో ఈడీ.. ఏం చేసుకుంటారో చేసుకోమనండి. మేం రెడీ. దేనికైనా రెడీ. ఇట్లాంటి దద్దమ్మలకు భయపడేది లేదు. నరేంద్ర మోడీ ఒక అసమర్థ ప్రధాని. దేశంలో ఆయనంత చేతకాని, పోటీ పడలేని, అసమర్థ, అవినీతి, పెట్టుబడిదారుల కొమ్ము కాసే నాయకుడు ఇంకొకరు లేరు. అలాంటి వ్యక్తి బెదిరింపులకు ఉడత ఊపులకి తెలంగాణ బిడ్డ కానే కాదు. మళ్లీ చెబుతున్నా ఏం చేసుకుంటారో చేసుకోమనండి” అంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు కేటీఆర్.

తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా చాలామంది ఇతర పార్టీల నేతల మీదికి ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పి వారిని తమ పార్టీలో చేర్చుకున్న ఘనత బీజేపీకే చెల్లిందని.. కానీ తెలంగాణలో ఇలాంటివి చెల్లవని.. ఇలాంటి బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on October 30, 2022 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

27 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

34 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago