తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, దీనిని ఇప్పటి వరకు బయటపెట్టలేదు. నిజానికి ఇది ఆగస్టులోనే తీసుకుంటే.. రెండు మాసాల పాటు ఏంచేశారనేది ప్రశ్న. సరే.. ఏదేమైనా.. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.
ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం రెండు నెలల క్రితమే తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం గమనార్హం. రెండు నెలలుగా ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందనేది కూడా ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలను ఎర వేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం వెలుగులోకి రావడం మరింత ఆసక్తిగా మారింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతి వెనక్కి తీసుకున్నట్లు అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే.. గతంలో ఏపీ ప్రభుత్వ సారథి చంద్రబాబు హయాంలో ఢిల్లీ పెద్దలతో వ్యవహారం చెడిపోయిన తర్వాత.. ఇలానే సీబీఐని అనుమతించేది లేదంటూ.. నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో కూడా పాస్ చేశారు. అయితే.. అప్పట్లో ఈ విషయంపై కేసీఆర్ కొన్ని కామెంట్లు చేశారు. “అక్రమాలు జరుగుతున్నప్పుడు.. విచారించాల్నా వద్దా.. అడ్డు చెప్తరా? అంటే.. అక్రమాలు ప్రొత్సహిస్తునట్టే కదా! ఇలాంటోళ్లు తెలంగాణకు వస్తే ఏం జరుగుతుంది?” అంటూ.. 2018 ఎన్నిక సమయంలో దీనిని కూడా ప్రచారానికి వాడుకున్నారు. మొత్తంగా చూస్తే.. తాజాగా జరిగిన పరిణామం కేసీఆర్కు మేలు చేయకపోగా మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on October 30, 2022 12:30 pm
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…
తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…
వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…