తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, దీనిని ఇప్పటి వరకు బయటపెట్టలేదు. నిజానికి ఇది ఆగస్టులోనే తీసుకుంటే.. రెండు మాసాల పాటు ఏంచేశారనేది ప్రశ్న. సరే.. ఏదేమైనా.. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.
ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం రెండు నెలల క్రితమే తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం గమనార్హం. రెండు నెలలుగా ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందనేది కూడా ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలను ఎర వేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం వెలుగులోకి రావడం మరింత ఆసక్తిగా మారింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతి వెనక్కి తీసుకున్నట్లు అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే.. గతంలో ఏపీ ప్రభుత్వ సారథి చంద్రబాబు హయాంలో ఢిల్లీ పెద్దలతో వ్యవహారం చెడిపోయిన తర్వాత.. ఇలానే సీబీఐని అనుమతించేది లేదంటూ.. నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో కూడా పాస్ చేశారు. అయితే.. అప్పట్లో ఈ విషయంపై కేసీఆర్ కొన్ని కామెంట్లు చేశారు. “అక్రమాలు జరుగుతున్నప్పుడు.. విచారించాల్నా వద్దా.. అడ్డు చెప్తరా? అంటే.. అక్రమాలు ప్రొత్సహిస్తునట్టే కదా! ఇలాంటోళ్లు తెలంగాణకు వస్తే ఏం జరుగుతుంది?” అంటూ.. 2018 ఎన్నిక సమయంలో దీనిని కూడా ప్రచారానికి వాడుకున్నారు. మొత్తంగా చూస్తే.. తాజాగా జరిగిన పరిణామం కేసీఆర్కు మేలు చేయకపోగా మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on October 30, 2022 12:30 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…