దేశంలోనే అత్యల్పంగా కరోనా పరీక్షలు చేసిన, చేస్తున్న రాష్ట్రంగా గత నెల వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది తెలంగాణ. ఓవైపు పక్కన్న ఆంధ్రప్రదేశ్లో లక్షలకు లక్షలు టెస్టులు చేస్తుంటే.. అందులో పదో శాతం టెస్టులతో తెలంగాణ బాగా వెనుకబడిపోయింది.
పరీక్షలు చేయకుండా కరోనాను నియంత్రించడం చాలా కష్టమని.. ఎవరెంతగా మొత్తుకున్నా ప్రభుత్వం పెద్దంగా స్పందించినట్లు కనిపించలేదు. హైకోర్టు జోక్యం చేసుకున్నా టెస్టుల సంఖ్య పెరగలేదు. ఐతే ఉన్నత న్యాయస్థానం మరోసారి సీరియస్ కావడం, జనాల్లో కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. టెస్టుల సంఖ్య పెరిగింది. గత రెండు వారాల్లో టెస్టుల సంఖ్య అనూహ్యంగా పెంచారు. మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినా.. కోర్టు జోక్యంతో మళ్లీ పరీక్షలు ఊపందుకున్నాయి.
ఒకప్పుడు రోజుకు వెయ్యి టెస్టులు చేయడమే గగనంగా ఉండగా.. ఇప్పుడు ఒకే రోజు పదివేలకు పైగా పరీక్షలు చేసే స్థాయికి చేరడం విశేషం. తెలంగాణలో ఇప్పటిదాకా ఏ రోజూ లేని విధంగా శుక్రవారం 10,354 కరోనా పరీక్షలు చేశారు. ఇది ఇప్పటిదాకా రికార్డు. అందులో 1278 మంది కరోనా పాజిటివ్గా తేలారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోని కేసులు 762 కాగా.. వివిధ జిల్లాల్లో 500కు పైనే కేసులు నమోదయ్యాయి. మొత్తం పరీక్షల్లో 13 శాతం లోపే పాజిటివ్ కేసులుండటం ఊరటనిచ్చే విషయమే కానీ.. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.
ఇప్పటిదాకా మొత్తం కేసుల్లో హైదరాబాద్లోనే దగ్గర దగ్గర 90 శాతం మధ్య ఉండేవి. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పెద్దగా విస్తరించనట్లే కనిపించేది. కానీ తాజా గణాంకాల్ని బట్టి చూస్తే జిల్లాల్లో కరోనా విజృంభిస్తోందని స్పష్టమవుతోంది. మరోవైపు ఒకేసారి 10 వేలకు పైగా టెస్టులంటే తెలంగాణలో కూడా ఏపీలో మాదిరి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 11, 2020 8:59 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…