Political News

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో రెండో ఆడియో లీక్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర తుఫానుగా మారిన ఫామ్‌హౌజ్ ముడుపులు, కొనుగోళ్ల వ్య‌వ‌హారంలో.. మ‌రో ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి వ‌చ్చిన తొలి ఆడియోలో.. స్పాట్‌పై చ‌ర్చించుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే నేత‌ల‌కు అభ‌యం కూడా ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఎక్క‌డ ఎప్పుడు ఎలా క‌ల‌వాలి.. ఏం చ‌ర్చించుకోవాల‌నే విష‌యంపై దృష్టి పెట్టారు. డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా విడులైన రెండో ఆడియో మ‌రింతగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎవ‌రెవ‌రికి ఎంతెంత మొత్తం ఇవ్వాల‌నే విష‌యంపై ఈ ఆడియోలో చ‌ర్చించుకున్నారు.

“నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్లు ఆశిస్తున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్‌ రెడ్డి ప్రధాన వ్యక్తి. రోహిత్‌ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, మిగిలినవారికి నామమాత్రం ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామన్నాం. మునుగోడు ఉప ఎన్నికకు ముందుగానైతే రూ. 100 కోట్లకు రావడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడి స్పష్టత ఇవ్వండి. నేను బి.ఎల్. సంతోష్‌కు మెస్సేజ్ చేస్తా. నలుగురు రావడానికి రెడీగా ఉన్నారని తుషార్‌తో చెప్పాను” ఇలా స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, సింహయాజులు, నందకుమార్ ముగ్గురి మధ్య సంభాషణలు జరిగాయి. ఈ ఆడియో మొత్తం 27 నిమిషాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన ప్ర‌య‌త్నం.. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ముందుగానే స‌మాచారం అందుకున్న‌ సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేశారు.

హైకోర్టు ఆదేశం ఇదే..

‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో సైబరాబాద్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. “నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దు. ముగ్గురు నిందితులు ఇవాళ సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు సమర్పించాలి. ఈకేసుతో సంబంధం ఉన్న రోహిత్‌రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దు’’ అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

This post was last modified on October 28, 2022 9:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago