Political News

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో రెండో ఆడియో లీక్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర తుఫానుగా మారిన ఫామ్‌హౌజ్ ముడుపులు, కొనుగోళ్ల వ్య‌వ‌హారంలో.. మ‌రో ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి వ‌చ్చిన తొలి ఆడియోలో.. స్పాట్‌పై చ‌ర్చించుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే నేత‌ల‌కు అభ‌యం కూడా ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఎక్క‌డ ఎప్పుడు ఎలా క‌ల‌వాలి.. ఏం చ‌ర్చించుకోవాల‌నే విష‌యంపై దృష్టి పెట్టారు. డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా విడులైన రెండో ఆడియో మ‌రింతగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎవ‌రెవ‌రికి ఎంతెంత మొత్తం ఇవ్వాల‌నే విష‌యంపై ఈ ఆడియోలో చ‌ర్చించుకున్నారు.

“నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్లు ఆశిస్తున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్‌ రెడ్డి ప్రధాన వ్యక్తి. రోహిత్‌ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, మిగిలినవారికి నామమాత్రం ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామన్నాం. మునుగోడు ఉప ఎన్నికకు ముందుగానైతే రూ. 100 కోట్లకు రావడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడి స్పష్టత ఇవ్వండి. నేను బి.ఎల్. సంతోష్‌కు మెస్సేజ్ చేస్తా. నలుగురు రావడానికి రెడీగా ఉన్నారని తుషార్‌తో చెప్పాను” ఇలా స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, సింహయాజులు, నందకుమార్ ముగ్గురి మధ్య సంభాషణలు జరిగాయి. ఈ ఆడియో మొత్తం 27 నిమిషాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన ప్ర‌య‌త్నం.. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ముందుగానే స‌మాచారం అందుకున్న‌ సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేశారు.

హైకోర్టు ఆదేశం ఇదే..

‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో సైబరాబాద్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. “నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దు. ముగ్గురు నిందితులు ఇవాళ సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు సమర్పించాలి. ఈకేసుతో సంబంధం ఉన్న రోహిత్‌రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దు’’ అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

This post was last modified on October 28, 2022 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

1 hour ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago