Political News

పవన్ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్

విశాఖ ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నేతలను పరుష పదజాలంతో పవన్ ఓ రేంజ్ లో దుయ్యబట్టారు. పవన్ విమర్శలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి విమర్శలు కూడా గుప్పించారు. పవన్ భాషకు ఏ మాత్రం తగ్గకుండా వైసీపీ నేతలు కూడా బూతు పంచాంగం అందుకున్నారు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.

కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా జగన్ కౌంటర్ ఇచ్చారు. 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మూడు రాజధానులు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుంది అని ప్రశ్నించారు. నాలుగైదేళ్లు కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకొని.. పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుబెడితే వ్యవస్థ ఏం బతుకుంది అని పవన్ పెళ్లిళ్లపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిస్థితి కొనసాగితే ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి.. ఒక్కసారి ఆలోచన చేయడం అంటూ జగన్ కామెంట్లు చేశారు. ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని కొందరు చెబుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నందని జగన్ అన్నారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తోందని జగన్ అన్నారు. పరోక్షంగా పవన్-చంద్రబాబుల పొత్తుపై కూడా జగన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

This post was last modified on October 20, 2022 11:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago