Political News

పవన్ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్

విశాఖ ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నేతలను పరుష పదజాలంతో పవన్ ఓ రేంజ్ లో దుయ్యబట్టారు. పవన్ విమర్శలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి విమర్శలు కూడా గుప్పించారు. పవన్ భాషకు ఏ మాత్రం తగ్గకుండా వైసీపీ నేతలు కూడా బూతు పంచాంగం అందుకున్నారు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.

కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా జగన్ కౌంటర్ ఇచ్చారు. 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మూడు రాజధానులు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుంది అని ప్రశ్నించారు. నాలుగైదేళ్లు కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకొని.. పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుబెడితే వ్యవస్థ ఏం బతుకుంది అని పవన్ పెళ్లిళ్లపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిస్థితి కొనసాగితే ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి.. ఒక్కసారి ఆలోచన చేయడం అంటూ జగన్ కామెంట్లు చేశారు. ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని కొందరు చెబుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నందని జగన్ అన్నారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తోందని జగన్ అన్నారు. పరోక్షంగా పవన్-చంద్రబాబుల పొత్తుపై కూడా జగన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

This post was last modified on October 20, 2022 11:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago