రాష్ట్ర బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో కలిసి దియోధర్ విజయవాడకు చేరుకోవటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడి చేయడం, తర్వాత పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోటల్ రూముకే ఒక రోజంతా పరిమితమైపోవటం అందరికీ తెలిసిందే.
విశాఖ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ పార్టీ మీటింగులో తనను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడంటున్న వైసీపీ నేతలపై బూతులు తిడుతు రెచ్చిపోయారు. అదే సమయంలో మాట్లాడుతు బీజేపీ మీద కూడా తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేయాలని అనుకుంటే బీజేపీ సహకరించటం లేదని మండిపోయారు. అందుకనే తన నిర్ణయం తాను తీసేసుకున్నట్లు చెప్పారు.
ఆ నిర్ణయం ఏమిటో చెప్పకపోయినా తర్వాత కొద్దిసేపటికే చంద్రబాబునాయుడుతో భేటీఅయ్యారు. వీళ్ళిద్దరి భేటీ బీజేపీలో సంచలనంగా మారింది. ఇది జరిగిన మరుసటిరోజే సీనియర్ నేత, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ వీర్రాజుపై మండిపడ్డారు. పవన్ విషయంలో బీజేపీ సరిగా స్పందించలేదన్నారు. మొత్తం మీద బీజేపీ పనితీరు ఏమీ బావోలేదని ధ్వజమెత్తారు. ఒకదాని తర్వాత మరోక పరిణామాలు వెంటవెంటనే జరిగిపోవటంతో కమలనాథుల్లో అయోమయం పెరిగిపోతోంది.
బహుశా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే అగ్రనాయకత్వం దియోధర్ ను రంగంలోకి దింపినట్లుంది. దియోధర్ కి పార్టీలోని అందరు నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్చార్జి వచ్చింది పవన్ తో మాట్లాడటానికా లేకపోతే కన్నాతో భేటీ అవటానికా అన్న విషయంలో స్పష్టతలేదు. తనతో పాటు చాలామందికి వీర్రాజు పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉందని కన్నా చెప్పారు. ఈ నేపధ్యంలోనే సీనియర్లందరితో దియోధర్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి భేటీలో ఏమి తేలుతుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on October 20, 2022 7:11 pm
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…