ఏపీలో మూడు రాజధానులు అనేది బుద్ధిలేని ఆలోచన అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. ఒక రాష్ట్రం.. ఒక రాజధాని అనేదే కాంగ్రెస్ నినాదమని.. దానికే తమ మద్దతు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో స్థానికంగా కొందరితోనూ.. ఆయన చర్చించారు. ఈ సందర్భంగా కొందరు రాజధాని విషయాన్ని ప్రస్తావించారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉందని.. అయితే.. ప్రభుత్వం మారాక మూడు రాజధానులు అనే పాట పాడుతోందని అన్నారు.
దీనిపై రాహుల్ స్పందిస్తూ.. తాను తెలుగు అర్ధం చేసుకుంటానని.. త్వరలోనే తెలుగులో కూడా మాట్లాడతానని.. చెప్పారు. తమ పార్టీ విధానం.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని వివరించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని.. దానికే తాము మద్దతిస్తామని అన్నారు. “నిన్న నన్ను.. కొందరు రైతులు కలిశారు. వారంతా కూడా.. అమరావతి కోసం.. తమ భూములు ఇచ్చారు. వారిప్పుడు.. ఇబ్బందిలో ఉన్నారు. పాదయాత్ర చేస్తున్నారు. రాజధాని కోసం.. వారు అలుపెరుగని కృషి చేస్తున్నారు. మేం మాత్రం అమరావతికే మద్దతిస్తాం. రైతులకు న్యాయం చేస్తాం“ అని అన్నారు.
దేశాన్ని ఏకం చేయడమే ‘భారత్ జోడో యాత్ర’ లక్ష్యమని, యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్నట్లు రాహుల్ చెప్పారు. పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన ఈ రోజు ఉదయం నడక ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు. “నేను గతంలో కూడా చెప్పాను. ప్రత్యేక హోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తాను. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు..“ అని వ్యాఖ్యానించారు.
కానీ, శుక్రవారం వరకు.. ఏపీలో రాహుల్ పాదయాత్ర జరగనుంది. మళ్లీ నాలుగు రోజుల్లో ఏపీలో ఆయన పాదయాత్ర మొదలు కానుంది. తాజాగా యాత్రకు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిని పేరు పేరునా.. రాహుల్ పలకరించడం గమనార్హం. వచ్చే ఎన్నికల నాటికి.. పార్టీని అధికారంలోకి తెచ్చేలా.. ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on October 19, 2022 3:49 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…