ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పవన్ ఖండించారు. ఈ క్రమంలో అక్కడ స్టీల్ ప్లాంటు కోసం.. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. అయితే.. ఈ ఉద్యమంలో ఉన్నవారు చిత్తశుద్ధితో ఉన్నారా? అని పవన్ ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఉన్నానని హామీ ఇస్తే..ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర గురించి.. మాట్లాడే వైసీపీ నాయకులకు.. ఉత్తరాంధ్ర గురించి ఏం తెలుసునని.. పవన్ ప్రశ్నించారు.
మంగళవారం.. ఆయన పార్టీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి మంగళగిరిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని వదిలేసి.. లేనిపోని సమస్యలు తెరమీదికి తెస్తున్నారని అన్నారు. అంతేకాదు.. జిందాల్ వంటి సంస్థలు అక్కడకు వస్తున్న ప్రభుత్వం తరఫున గనుల సంస్థలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ‘అవంతి.. బంతి..’ అంటూ.. వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఉత్తరాంధ్ర చరిత్రలో స్టీల్ ప్లాంట్ కోసం.. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని.. అలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే.. ప్రస్తుత ప్రబుత్వం చూస్తూ.. నీళ్లు నములుతోందని.. అదేమంటే.. కేంద్రానికి లేఖలు రాశామని.. చెబుతోందని.. లేఖలు రాస్తే.. పనులు జరుగుతాయంటే.. పాలన కోసం.. సీఎంను ఎన్నుకోవడం.. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును పరిరక్షించేందుకు .. అక్కడ ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా గర్జన చేస్తే.. తాను కూడా పాదం కదిపేవాడినని.. కానీ, లేని పోని ప్రాంతీయ భావం పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. స్టీలు ప్లాంటు ఉద్యోగులకు జనసేన ఎప్పటికీ అండగా ఉంటుందని పవన్ స్ఫష్టం చేశారు.
This post was last modified on October 18, 2022 2:29 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…