ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పవన్ ఖండించారు. ఈ క్రమంలో అక్కడ స్టీల్ ప్లాంటు కోసం.. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. అయితే.. ఈ ఉద్యమంలో ఉన్నవారు చిత్తశుద్ధితో ఉన్నారా? అని పవన్ ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఉన్నానని హామీ ఇస్తే..ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర గురించి.. మాట్లాడే వైసీపీ నాయకులకు.. ఉత్తరాంధ్ర గురించి ఏం తెలుసునని.. పవన్ ప్రశ్నించారు.
మంగళవారం.. ఆయన పార్టీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి మంగళగిరిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని వదిలేసి.. లేనిపోని సమస్యలు తెరమీదికి తెస్తున్నారని అన్నారు. అంతేకాదు.. జిందాల్ వంటి సంస్థలు అక్కడకు వస్తున్న ప్రభుత్వం తరఫున గనుల సంస్థలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ‘అవంతి.. బంతి..’ అంటూ.. వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఉత్తరాంధ్ర చరిత్రలో స్టీల్ ప్లాంట్ కోసం.. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని.. అలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే.. ప్రస్తుత ప్రబుత్వం చూస్తూ.. నీళ్లు నములుతోందని.. అదేమంటే.. కేంద్రానికి లేఖలు రాశామని.. చెబుతోందని.. లేఖలు రాస్తే.. పనులు జరుగుతాయంటే.. పాలన కోసం.. సీఎంను ఎన్నుకోవడం.. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును పరిరక్షించేందుకు .. అక్కడ ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా గర్జన చేస్తే.. తాను కూడా పాదం కదిపేవాడినని.. కానీ, లేని పోని ప్రాంతీయ భావం పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. స్టీలు ప్లాంటు ఉద్యోగులకు జనసేన ఎప్పటికీ అండగా ఉంటుందని పవన్ స్ఫష్టం చేశారు.
This post was last modified on October 18, 2022 2:29 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…