ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పవన్ ఖండించారు. ఈ క్రమంలో అక్కడ స్టీల్ ప్లాంటు కోసం.. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. అయితే.. ఈ ఉద్యమంలో ఉన్నవారు చిత్తశుద్ధితో ఉన్నారా? అని పవన్ ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఉన్నానని హామీ ఇస్తే..ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర గురించి.. మాట్లాడే వైసీపీ నాయకులకు.. ఉత్తరాంధ్ర గురించి ఏం తెలుసునని.. పవన్ ప్రశ్నించారు.
మంగళవారం.. ఆయన పార్టీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి మంగళగిరిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని వదిలేసి.. లేనిపోని సమస్యలు తెరమీదికి తెస్తున్నారని అన్నారు. అంతేకాదు.. జిందాల్ వంటి సంస్థలు అక్కడకు వస్తున్న ప్రభుత్వం తరఫున గనుల సంస్థలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ‘అవంతి.. బంతి..’ అంటూ.. వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఉత్తరాంధ్ర చరిత్రలో స్టీల్ ప్లాంట్ కోసం.. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని.. అలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే.. ప్రస్తుత ప్రబుత్వం చూస్తూ.. నీళ్లు నములుతోందని.. అదేమంటే.. కేంద్రానికి లేఖలు రాశామని.. చెబుతోందని.. లేఖలు రాస్తే.. పనులు జరుగుతాయంటే.. పాలన కోసం.. సీఎంను ఎన్నుకోవడం.. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును పరిరక్షించేందుకు .. అక్కడ ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా గర్జన చేస్తే.. తాను కూడా పాదం కదిపేవాడినని.. కానీ, లేని పోని ప్రాంతీయ భావం పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. స్టీలు ప్లాంటు ఉద్యోగులకు జనసేన ఎప్పటికీ అండగా ఉంటుందని పవన్ స్ఫష్టం చేశారు.
This post was last modified on October 18, 2022 2:29 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…