ఒకవైపు.. తెలంగాణలో రాజకీయ వేడి కాకమీదుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకోవాలని.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా.. పంతంతో ఉన్నాయి. అయితే.. బరిలో మాత్రంహోరా హోరీ పోరు సాగుతోంది. టీఆర్ ఎస్కు అనుకూల మీడియా ఉంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతుండడంతో కవరేజీ బాగుంది. అయితే.. ఎటొచ్చీ.. కాంగ్రెస్కు మీడియా ఏమేరకు సహకరిస్తుందనే వాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేతలు.. మీడియా మొఘల్ రామోజీరావుతో భేటీ అయ్యారు.
నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన.. పీసీసీ చీఫ్ రేవంత్, మరోనేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీతో కలిసి..వెళ్లి.. రామోజీని కలుసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా..వారు.. ఏం చర్చించారనేది.. ఆసక్తిగా మారింది. ఎక్కువ మంది మునుగోడు ఉప ఎన్నికలో తమకు అనుకూలంగా ప్రచారం చేయమని.. కోరే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, ఎన్నికల విషయంపై కాంగ్రెస్ నేతలు.. రామోజీతో భేటీ కాలేదు. కేవలం.. భారత్ జోడో యాత్ర గురించి మాత్రమే చర్చించారని తెలిసింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర.. మంగళవారం ఏపీలో ప్రారంభమై.. నాలుగు రోజులు సాగనుంది.
అనంతరం.. కర్ణాటకలో సాగి..తర్వాత.. తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 14 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఒకింత బాగా కవరేజీ ఇవ్వాలని.. పాదయాత్రను సానుకూలంగా ప్రచురించాలని.. కోరేందుకు. రేవంత్రెడ్డి.. రామోజీతో భేటీ అయినట్టు తెలిసింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని.. మీపని మీరు చేయండి.. మా పనిమేం చేస్తాం!! అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
This post was last modified on October 18, 2022 11:08 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…