ఒకవైపు.. తెలంగాణలో రాజకీయ వేడి కాకమీదుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకోవాలని.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా.. పంతంతో ఉన్నాయి. అయితే.. బరిలో మాత్రంహోరా హోరీ పోరు సాగుతోంది. టీఆర్ ఎస్కు అనుకూల మీడియా ఉంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతుండడంతో కవరేజీ బాగుంది. అయితే.. ఎటొచ్చీ.. కాంగ్రెస్కు మీడియా ఏమేరకు సహకరిస్తుందనే వాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేతలు.. మీడియా మొఘల్ రామోజీరావుతో భేటీ అయ్యారు.
నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన.. పీసీసీ చీఫ్ రేవంత్, మరోనేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీతో కలిసి..వెళ్లి.. రామోజీని కలుసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా..వారు.. ఏం చర్చించారనేది.. ఆసక్తిగా మారింది. ఎక్కువ మంది మునుగోడు ఉప ఎన్నికలో తమకు అనుకూలంగా ప్రచారం చేయమని.. కోరే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, ఎన్నికల విషయంపై కాంగ్రెస్ నేతలు.. రామోజీతో భేటీ కాలేదు. కేవలం.. భారత్ జోడో యాత్ర గురించి మాత్రమే చర్చించారని తెలిసింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర.. మంగళవారం ఏపీలో ప్రారంభమై.. నాలుగు రోజులు సాగనుంది.
అనంతరం.. కర్ణాటకలో సాగి..తర్వాత.. తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 14 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఒకింత బాగా కవరేజీ ఇవ్వాలని.. పాదయాత్రను సానుకూలంగా ప్రచురించాలని.. కోరేందుకు. రేవంత్రెడ్డి.. రామోజీతో భేటీ అయినట్టు తెలిసింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని.. మీపని మీరు చేయండి.. మా పనిమేం చేస్తాం!! అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
This post was last modified on October 18, 2022 11:08 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…