ఒకవైపు.. తెలంగాణలో రాజకీయ వేడి కాకమీదుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకోవాలని.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా.. పంతంతో ఉన్నాయి. అయితే.. బరిలో మాత్రంహోరా హోరీ పోరు సాగుతోంది. టీఆర్ ఎస్కు అనుకూల మీడియా ఉంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతుండడంతో కవరేజీ బాగుంది. అయితే.. ఎటొచ్చీ.. కాంగ్రెస్కు మీడియా ఏమేరకు సహకరిస్తుందనే వాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేతలు.. మీడియా మొఘల్ రామోజీరావుతో భేటీ అయ్యారు.
నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన.. పీసీసీ చీఫ్ రేవంత్, మరోనేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీతో కలిసి..వెళ్లి.. రామోజీని కలుసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా..వారు.. ఏం చర్చించారనేది.. ఆసక్తిగా మారింది. ఎక్కువ మంది మునుగోడు ఉప ఎన్నికలో తమకు అనుకూలంగా ప్రచారం చేయమని.. కోరే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, ఎన్నికల విషయంపై కాంగ్రెస్ నేతలు.. రామోజీతో భేటీ కాలేదు. కేవలం.. భారత్ జోడో యాత్ర గురించి మాత్రమే చర్చించారని తెలిసింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర.. మంగళవారం ఏపీలో ప్రారంభమై.. నాలుగు రోజులు సాగనుంది.
అనంతరం.. కర్ణాటకలో సాగి..తర్వాత.. తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 14 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఒకింత బాగా కవరేజీ ఇవ్వాలని.. పాదయాత్రను సానుకూలంగా ప్రచురించాలని.. కోరేందుకు. రేవంత్రెడ్డి.. రామోజీతో భేటీ అయినట్టు తెలిసింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని.. మీపని మీరు చేయండి.. మా పనిమేం చేస్తాం!! అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
This post was last modified on October 18, 2022 11:08 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…