Political News

జగన్‌కు పవన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకోని, ఎంతో కొంత చెడ్డ పేరు సంపాదించని రోజంటూ ఉండట్లేదు ఈ మధ్య. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. మూడేళ్ల పాటు రాజధాని విషయమై అసలేమీ చేయకపోవడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది జగన్ సర్కారు.
తాజాగా విశాఖ గర్జన పేరుతో వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కాలేజీ విద్యార్థులను, డ్వాక్రా మహిళలను ఈ కార్యక్రమానికి తరలించి ఎంత హంగామా చేద్దామని చూసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక ఆ కార్యక్రమం జరిగే రోజే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవాణి కార్యక్రమం కోసం జనసేనాని విశాఖకు వస్తే.. ఆయన ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏదో రకంగా పోలీసులు, అధికారులు ఇబ్బంది పెడుతూ వచ్చారు.

పవన్‌ను ఎలాగోలా నియంత్రించాలని చూస్తే.. అది కాస్తా బెడిసికొట్టి ఆయన హీరో అయిపోతున్నాడు. పవన్‌ను తన మానాన తనను వదిలేస్తే.. ఒక రోడ్ షో చేసుకుని, ఆ తర్వాత జనవాణి కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయేవాడు. కానీ పవన్ వచ్చే దారుల్లో లైట్లు ఆపించేయడం, ఆయన అభిమానులకు అభివాదం కూడా చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో మీడియాలో ఈ విషయం బాగా హైలైట్ అయింది. లైట్లు ఆగిపోతే అభిమానులు సెల్ ఫోన్ లైట్లతో వెలుగునివ్వడంతో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. అద్భుతమైన విజువల్స్ జనసేనకు దొరికాయి. ఇక రోడ్ షోలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ వల్ల కూడా అది వార్తాంశంగా మారింది.

ఇక పవన్‌ను హోటల్లోనియంత్రించడం, జనసేన నాయకులను అరెస్ట్ చేయడంతో వ్యవహారం రంజుగా మారింది. దీని వల్ల విశాఖ గర్జన కార్యక్రమం గురించి అసలు చర్చే లేకుండా పోయింది. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ దగ్గర వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం.. పవన్‌కు నోటీసులివ్వడం.. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రాత్రంతా చేసిన హంగామా వల్ల రాష్ట్ర రాజకీయం అంతా పవన్ చుట్టూ తిరుగుతోంది రెండు రోజులుగా. మొత్తానికి చూస్తే పవన్‌ను నియంత్రించబోయి అతణ్ని పెద్ద హీరోను చేసిన ఘనత జగన్ సర్కారుకే దక్కుతుందనడంలో సందేహం లేదు. ఇందుకు జనసేనాని జగన్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిందే.

This post was last modified on October 17, 2022 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

11 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

54 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago