Political News

ఏపీలో ‘ఏకైక’ పోరాటం.. చేతులు క‌లుపుతున్న పార్టీలు!!

‘నువ్వు ఉత్త‌రం అయితే.. నేను ద‌క్షిణం’ అన్న‌ట్టుగా ఉన్న పార్టీల ప‌రిస్థితి ఇక‌.. ప‌క్కకు పోనుందా.. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. ఇక‌పై ఉండ‌బోవా?! అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎదుటి పార్టీకి ముల్లుగుచ్చుకుంటే.. మాకెందుకులే అనుకున్న‌వారంతా.. ఇప్పుడు.. త‌మ దాకా వ‌చ్చేసరికి.. విష‌యం తెలుసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక‌, అంద‌రిదీ ఒకే బాట‌.. అన్న‌ట్టుగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు .. జ‌న‌సేనను చూసి.. కొన్ని పార్టీలు ధైర్యంగా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆపార్టీని ప‌ట్టుకుని.. ముందుకు సాగాల‌ని.. ఆ పార్టీతో క‌లిసి చెలిమి చేయాల‌ని.. అనుకున్నాయి.

అవి క‌మ్యూనిస్టులు కావొచ్చు.. ఇత‌ర పార్టీలు కావొచ్చు. అయితే.. ఇప్పుడు ఆ జ‌న‌సేన‌ను క‌ట్టడి చేసేందుకు వైసీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ‌ల్లో వేరే సంకేతాలు పంపాల‌నేది.. పాల‌క ప‌క్షం నాయ‌కుల ఆలోచ‌న‌గా ఉంద‌ని.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. దీనికి ఆదిలోనే చెక్ పెట్టాల‌ని.. నిర్ణ‌యించుకున్నాయి. దీంతో ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడ‌డం కాదు.. ఇప్ప‌టి నుంచి చేతులు క‌ల‌పాల‌ని.. కీల‌క నేత‌ల మ‌ధ్య ఆలోచ‌న స్ఫురించిన‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. ఒక‌వైపు రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టించడం.. మ‌రోవైపు.. ఉత్త‌రాంధ్ర‌లో ఇత‌ర నేత‌ల ప‌ర్య‌ట‌ల‌ను అడ్డుకోవ‌డాన్ని నాయ‌కులు తీవ్రంగానే భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే సిద్ధాంతాలు.. రాద్ధాంతాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని.. అన్ని పార్టీలు.. ఒకే మాట‌.. ఒకే బాట‌గా ముందుకు సాగాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే లా.. అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. దీనికి సంబంధించి వైసీపీయేత‌ర పార్టీల‌న్నీ.. త్వ‌ర‌లోనే తిరుప‌తి వేదిక‌గా.. స‌మావేశం ఏర్పాటు చేసుకుని.. కామ‌న్ అజెండాను రూపొందించుకుని.. ముందుకు సాగాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విశాఖ‌లో నెల‌కొన్న వివాదం.. మ‌రోవైపు రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్రకు అడ్డంకులు.. కీల‌క నేత‌ల‌ను అడ్డుకోవ‌డం.. వంటివి.. పార్టీలు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోన‌నే అన్ని పార్టీలు చేతులు క‌ల‌ప‌డం ద్వారా.. మ‌ళ్లీ 2009లో ఉమ్మ‌డి ఏపీలో ఏర్ప‌డిన రాజ‌కీయ పరిస్థితిని తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 17, 2022 1:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago