తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. పెద్ద స్థాయిలో రెకమండేషన్ ఉంటే తప్ప బెడ్ దొరకడం లేదు. దొరికాక కొన్ని రోజులకే లక్షలకు లక్షలు ఎలా బిల్లులు వాయించేస్తున్నారో తెలిసిందే. ఐతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పటికీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందట్లేదని ఆందోళన చెందుతున్న పేషెంట్లు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఐతే ఇలా లాభం లేదని.. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం పొందుతున్న సామాన్య పేషెంట్లూ ఉంటున్నారు.
తమ పరిస్థితిని తెలియజేస్తూ.. మంత్రులతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ట్యాగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ ఇప్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఇలా మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వీడియో పెట్టిన ఓ జర్నలిస్టు అపోలో ఆసుపత్రిలో బెడ్ సంపాదించాడు. మరో నెటిజన్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్కు విన్నవించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.
ఇలాంటి వాటిని టాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు హైలైట్ చేస్తుండటంతో అనారోగ్యం తీవ్రమవుతున్న కరోనా పేషెంట్లందరూ ఇక ఇదే బాట పడుతున్నారు. ఐతే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి పని జరుగుతోంది కానీ.. దీనిపై అవగాహన, యాక్సెస్ లేని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.
This post was last modified on July 10, 2020 8:42 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…