Political News

ట్విట్టర్ ట్రెండ్: మంత్రిగారూ అడ్మిషన్ ప్లీజ్

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. పెద్ద స్థాయిలో రెకమండేషన్ ఉంటే తప్ప బెడ్ దొరకడం లేదు. దొరికాక కొన్ని రోజులకే లక్షలకు లక్షలు ఎలా బిల్లులు వాయించేస్తున్నారో తెలిసిందే. ఐతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పటికీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందట్లేదని ఆందోళన చెందుతున్న పేషెంట్లు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఐతే ఇలా లాభం లేదని.. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం పొందుతున్న సామాన్య పేషెంట్లూ ఉంటున్నారు.

తమ పరిస్థితిని తెలియజేస్తూ.. మంత్రులతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ట్యాగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ ఇప్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఇలా మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వీడియో పెట్టిన ఓ జర్నలిస్టు అపోలో ఆసుపత్రిలో బెడ్ సంపాదించాడు. మరో నెటిజన్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు విన్నవించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.

ఇలాంటి వాటిని టాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు హైలైట్ చేస్తుండటంతో అనారోగ్యం తీవ్రమవుతున్న కరోనా పేషెంట్లందరూ ఇక ఇదే బాట పడుతున్నారు. ఐతే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి పని జరుగుతోంది కానీ.. దీనిపై అవగాహన, యాక్సెస్ లేని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.

suman

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

6 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

8 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

45 minutes ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

1 hour ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago