తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. పెద్ద స్థాయిలో రెకమండేషన్ ఉంటే తప్ప బెడ్ దొరకడం లేదు. దొరికాక కొన్ని రోజులకే లక్షలకు లక్షలు ఎలా బిల్లులు వాయించేస్తున్నారో తెలిసిందే. ఐతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పటికీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందట్లేదని ఆందోళన చెందుతున్న పేషెంట్లు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఐతే ఇలా లాభం లేదని.. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం పొందుతున్న సామాన్య పేషెంట్లూ ఉంటున్నారు.
తమ పరిస్థితిని తెలియజేస్తూ.. మంత్రులతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ట్యాగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ ఇప్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఇలా మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వీడియో పెట్టిన ఓ జర్నలిస్టు అపోలో ఆసుపత్రిలో బెడ్ సంపాదించాడు. మరో నెటిజన్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్కు విన్నవించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.
ఇలాంటి వాటిని టాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు హైలైట్ చేస్తుండటంతో అనారోగ్యం తీవ్రమవుతున్న కరోనా పేషెంట్లందరూ ఇక ఇదే బాట పడుతున్నారు. ఐతే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి పని జరుగుతోంది కానీ.. దీనిపై అవగాహన, యాక్సెస్ లేని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.
This post was last modified on July 10, 2020 8:42 am
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…