తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. పెద్ద స్థాయిలో రెకమండేషన్ ఉంటే తప్ప బెడ్ దొరకడం లేదు. దొరికాక కొన్ని రోజులకే లక్షలకు లక్షలు ఎలా బిల్లులు వాయించేస్తున్నారో తెలిసిందే. ఐతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పటికీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందట్లేదని ఆందోళన చెందుతున్న పేషెంట్లు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఐతే ఇలా లాభం లేదని.. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం పొందుతున్న సామాన్య పేషెంట్లూ ఉంటున్నారు.
తమ పరిస్థితిని తెలియజేస్తూ.. మంత్రులతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ట్యాగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ ఇప్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఇలా మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వీడియో పెట్టిన ఓ జర్నలిస్టు అపోలో ఆసుపత్రిలో బెడ్ సంపాదించాడు. మరో నెటిజన్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్కు విన్నవించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.
ఇలాంటి వాటిని టాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు హైలైట్ చేస్తుండటంతో అనారోగ్యం తీవ్రమవుతున్న కరోనా పేషెంట్లందరూ ఇక ఇదే బాట పడుతున్నారు. ఐతే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి పని జరుగుతోంది కానీ.. దీనిపై అవగాహన, యాక్సెస్ లేని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.
This post was last modified on July 10, 2020 8:42 am
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…