Political News

విశాఖ‌లో ఎందుకింత హ‌డావుడి.. సామాన్యుల జీవితాలు ప‌ట్ట‌వా?

సుంద‌ర‌మైన న‌దీతీరం.. ఆట‌విడుపు ప్రాంతాల‌కు నెల‌వు అయిన విశాఖ ఇప్పుడు.. రాజ‌కీయ వ్యూహాల మ‌ధ్య చిక్కి.. న‌లిగిపోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటు అధికార పార్టీ.. అటు ప్ర‌తిప‌క్షాలు కూడా.. విశాఖ కేంద్రంగా చేస్తున్న రాజ‌కీయాలు.. ఊహాతీతంగా మారిపోయాయి. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామని.. చెబుతున్న అధికార పార్టీ నేత‌లు.. కాదు.. ఏకైక రాజ‌ధానే ముఖ్య‌మంటున్న ప్ర‌తిప‌క్షాలు విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని.. ఉద్య‌మిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్య‌మాల‌తో సామాన్యులు న‌లిగిపోతున్నార‌నేది వాస్త‌వం. రెండు రోజుల ముందు నుంచే చేప‌ట్టిన గ‌ర్జ‌న హ‌డావుడితో.. విశాఖ న‌గ‌రం బోసిపోయింది. చిరు వ్యాపారుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు.

రెండు రోజుల ముందు నుంచే.. వ్యాపారాల‌ను నిలిపివేసుకోవాల‌న్న‌.. పోలీసుల ఆంక్ష‌ల‌తో చిరు వ్యాపారుల‌కు ప్రాణ సంక‌ట ప‌రిస్థితి ఎదురైంది. తీరా విశాఖ గ‌ర్జ‌న ముగిసింది. అయితే.. ఈ గ‌ర్జ‌న అనంత‌ర ప‌రిణామాలు.. విశాఖ‌ను మ‌రింత ఇబ్బంది పెడుతున్నాయి. గ‌ర్జ‌న ముగిసి వెళ్తున్న మంత్రి వ‌ర్గంలోని స‌భ్యుల‌పై జ‌న‌సేన అభిమానులు కొంద‌రు రాళ్లు రువ్వార‌ని.. మంత్రులు ఆరోపిస్తున్నారు. అబ్బే అదేం లేద‌ని.. జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. ఇదంతా నాట‌క‌మేన‌ని అంటున్నారు. అయితే.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసులు మ‌రోసారి విశాఖ‌ను అష్ట‌దిగ్భంధ‌నం చేసేశారు. ఫ‌లితంగా వ‌రుస‌గా నాలుగోరోజు కూడా.. విశాఖ‌లో క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

“రాజ‌ధాని మాటేమో.. కానీ, మా వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయి. గ‌ర్జ‌న కు రెండు రోజుల ముందు నుంచి మేం వ్యాపారాలు నిలిపివేసుకున్నాం. ఆదివారాలు వ‌స్తే.. అంతో ఇంతో సంపాయించుకునే ప‌రిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు పోయింది. ఇలా అయితే.. మేం ఎలా బ‌త‌కాలి? పైగా పండ‌గ‌ల సీజ‌న్‌” అని సామాన్యులు రోదిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాజ‌ధాని వ‌చ్చిందా.. రాలేదా.. అనేది కాదు.. ప్ర‌జ‌ల సాధార‌ణ జీవ‌న‌మే ప్ర‌ధానంగా సాగాల్సిన చోట‌.. నేడు పోలీసు వాహ‌నాల సైర‌న్లు.. బూటు కాళ్ల చ‌ప్పుళ్ల‌తో తీర‌ప్రాంత జిల్లా అట్టుడుకుతోంది.

ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రంగంలోకి దిగారు. జ‌న‌వాణి నిర్వ‌హించేందుకు ఆయ‌న స‌మాయ‌త్త‌మ‌య్యారు. వాస్త‌వానికి.. నిజం చెప్పుకోవాలంటే.. గ‌ర్జ‌న ఉన్న విష‌యం ఆయ‌న‌కు తెలిసిన‌ప్పుడు.. ఈ కార్య‌క్ర‌మాన్ని రెండు రోజులు వాయిదా వేసుకుంటే.. న‌గ‌రంలో ఒకింత ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకునేవారు. కానీ, ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇక‌, ప‌వ‌న్‌ను చూసేందుకు వ‌చ్చిన అభిమానులు సైతం.. దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌నే టాక్ ఉంది. వెర‌సి.. మొత్తంగా.. విశాఖ ఇప్పుడు అట్టుడుకుతోంది. దీంతో అంతిమంగా.. త‌మ‌కు రాజ‌ధాని అవ‌స‌రం లేద‌నే దిశ‌గా ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నా.. ఆశ్చ‌ర్యంలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 16, 2022 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

2 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

4 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

4 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

6 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

8 hours ago

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…

8 hours ago