Political News

విశాఖ‌లో ఎందుకింత హ‌డావుడి.. సామాన్యుల జీవితాలు ప‌ట్ట‌వా?

సుంద‌ర‌మైన న‌దీతీరం.. ఆట‌విడుపు ప్రాంతాల‌కు నెల‌వు అయిన విశాఖ ఇప్పుడు.. రాజ‌కీయ వ్యూహాల మ‌ధ్య చిక్కి.. న‌లిగిపోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటు అధికార పార్టీ.. అటు ప్ర‌తిప‌క్షాలు కూడా.. విశాఖ కేంద్రంగా చేస్తున్న రాజ‌కీయాలు.. ఊహాతీతంగా మారిపోయాయి. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామని.. చెబుతున్న అధికార పార్టీ నేత‌లు.. కాదు.. ఏకైక రాజ‌ధానే ముఖ్య‌మంటున్న ప్ర‌తిప‌క్షాలు విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని.. ఉద్య‌మిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్య‌మాల‌తో సామాన్యులు న‌లిగిపోతున్నార‌నేది వాస్త‌వం. రెండు రోజుల ముందు నుంచే చేప‌ట్టిన గ‌ర్జ‌న హ‌డావుడితో.. విశాఖ న‌గ‌రం బోసిపోయింది. చిరు వ్యాపారుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు.

రెండు రోజుల ముందు నుంచే.. వ్యాపారాల‌ను నిలిపివేసుకోవాల‌న్న‌.. పోలీసుల ఆంక్ష‌ల‌తో చిరు వ్యాపారుల‌కు ప్రాణ సంక‌ట ప‌రిస్థితి ఎదురైంది. తీరా విశాఖ గ‌ర్జ‌న ముగిసింది. అయితే.. ఈ గ‌ర్జ‌న అనంత‌ర ప‌రిణామాలు.. విశాఖ‌ను మ‌రింత ఇబ్బంది పెడుతున్నాయి. గ‌ర్జ‌న ముగిసి వెళ్తున్న మంత్రి వ‌ర్గంలోని స‌భ్యుల‌పై జ‌న‌సేన అభిమానులు కొంద‌రు రాళ్లు రువ్వార‌ని.. మంత్రులు ఆరోపిస్తున్నారు. అబ్బే అదేం లేద‌ని.. జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. ఇదంతా నాట‌క‌మేన‌ని అంటున్నారు. అయితే.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసులు మ‌రోసారి విశాఖ‌ను అష్ట‌దిగ్భంధ‌నం చేసేశారు. ఫ‌లితంగా వ‌రుస‌గా నాలుగోరోజు కూడా.. విశాఖ‌లో క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

“రాజ‌ధాని మాటేమో.. కానీ, మా వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయి. గ‌ర్జ‌న కు రెండు రోజుల ముందు నుంచి మేం వ్యాపారాలు నిలిపివేసుకున్నాం. ఆదివారాలు వ‌స్తే.. అంతో ఇంతో సంపాయించుకునే ప‌రిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు పోయింది. ఇలా అయితే.. మేం ఎలా బ‌త‌కాలి? పైగా పండ‌గ‌ల సీజ‌న్‌” అని సామాన్యులు రోదిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాజ‌ధాని వ‌చ్చిందా.. రాలేదా.. అనేది కాదు.. ప్ర‌జ‌ల సాధార‌ణ జీవ‌న‌మే ప్ర‌ధానంగా సాగాల్సిన చోట‌.. నేడు పోలీసు వాహ‌నాల సైర‌న్లు.. బూటు కాళ్ల చ‌ప్పుళ్ల‌తో తీర‌ప్రాంత జిల్లా అట్టుడుకుతోంది.

ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రంగంలోకి దిగారు. జ‌న‌వాణి నిర్వ‌హించేందుకు ఆయ‌న స‌మాయ‌త్త‌మ‌య్యారు. వాస్త‌వానికి.. నిజం చెప్పుకోవాలంటే.. గ‌ర్జ‌న ఉన్న విష‌యం ఆయ‌న‌కు తెలిసిన‌ప్పుడు.. ఈ కార్య‌క్ర‌మాన్ని రెండు రోజులు వాయిదా వేసుకుంటే.. న‌గ‌రంలో ఒకింత ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకునేవారు. కానీ, ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇక‌, ప‌వ‌న్‌ను చూసేందుకు వ‌చ్చిన అభిమానులు సైతం.. దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌నే టాక్ ఉంది. వెర‌సి.. మొత్తంగా.. విశాఖ ఇప్పుడు అట్టుడుకుతోంది. దీంతో అంతిమంగా.. త‌మ‌కు రాజ‌ధాని అవ‌స‌రం లేద‌నే దిశ‌గా ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నా.. ఆశ్చ‌ర్యంలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

56 minutes ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

1 hour ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

4 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

5 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

6 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

6 hours ago