Political News

విశాఖ‌లో ఎందుకింత హ‌డావుడి.. సామాన్యుల జీవితాలు ప‌ట్ట‌వా?

సుంద‌ర‌మైన న‌దీతీరం.. ఆట‌విడుపు ప్రాంతాల‌కు నెల‌వు అయిన విశాఖ ఇప్పుడు.. రాజ‌కీయ వ్యూహాల మ‌ధ్య చిక్కి.. న‌లిగిపోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటు అధికార పార్టీ.. అటు ప్ర‌తిప‌క్షాలు కూడా.. విశాఖ కేంద్రంగా చేస్తున్న రాజ‌కీయాలు.. ఊహాతీతంగా మారిపోయాయి. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామని.. చెబుతున్న అధికార పార్టీ నేత‌లు.. కాదు.. ఏకైక రాజ‌ధానే ముఖ్య‌మంటున్న ప్ర‌తిప‌క్షాలు విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని.. ఉద్య‌మిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్య‌మాల‌తో సామాన్యులు న‌లిగిపోతున్నార‌నేది వాస్త‌వం. రెండు రోజుల ముందు నుంచే చేప‌ట్టిన గ‌ర్జ‌న హ‌డావుడితో.. విశాఖ న‌గ‌రం బోసిపోయింది. చిరు వ్యాపారుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు.

రెండు రోజుల ముందు నుంచే.. వ్యాపారాల‌ను నిలిపివేసుకోవాల‌న్న‌.. పోలీసుల ఆంక్ష‌ల‌తో చిరు వ్యాపారుల‌కు ప్రాణ సంక‌ట ప‌రిస్థితి ఎదురైంది. తీరా విశాఖ గ‌ర్జ‌న ముగిసింది. అయితే.. ఈ గ‌ర్జ‌న అనంత‌ర ప‌రిణామాలు.. విశాఖ‌ను మ‌రింత ఇబ్బంది పెడుతున్నాయి. గ‌ర్జ‌న ముగిసి వెళ్తున్న మంత్రి వ‌ర్గంలోని స‌భ్యుల‌పై జ‌న‌సేన అభిమానులు కొంద‌రు రాళ్లు రువ్వార‌ని.. మంత్రులు ఆరోపిస్తున్నారు. అబ్బే అదేం లేద‌ని.. జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. ఇదంతా నాట‌క‌మేన‌ని అంటున్నారు. అయితే.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసులు మ‌రోసారి విశాఖ‌ను అష్ట‌దిగ్భంధ‌నం చేసేశారు. ఫ‌లితంగా వ‌రుస‌గా నాలుగోరోజు కూడా.. విశాఖ‌లో క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

“రాజ‌ధాని మాటేమో.. కానీ, మా వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయి. గ‌ర్జ‌న కు రెండు రోజుల ముందు నుంచి మేం వ్యాపారాలు నిలిపివేసుకున్నాం. ఆదివారాలు వ‌స్తే.. అంతో ఇంతో సంపాయించుకునే ప‌రిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు పోయింది. ఇలా అయితే.. మేం ఎలా బ‌త‌కాలి? పైగా పండ‌గ‌ల సీజ‌న్‌” అని సామాన్యులు రోదిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాజ‌ధాని వ‌చ్చిందా.. రాలేదా.. అనేది కాదు.. ప్ర‌జ‌ల సాధార‌ణ జీవ‌న‌మే ప్ర‌ధానంగా సాగాల్సిన చోట‌.. నేడు పోలీసు వాహ‌నాల సైర‌న్లు.. బూటు కాళ్ల చ‌ప్పుళ్ల‌తో తీర‌ప్రాంత జిల్లా అట్టుడుకుతోంది.

ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రంగంలోకి దిగారు. జ‌న‌వాణి నిర్వ‌హించేందుకు ఆయ‌న స‌మాయ‌త్త‌మ‌య్యారు. వాస్త‌వానికి.. నిజం చెప్పుకోవాలంటే.. గ‌ర్జ‌న ఉన్న విష‌యం ఆయ‌న‌కు తెలిసిన‌ప్పుడు.. ఈ కార్య‌క్ర‌మాన్ని రెండు రోజులు వాయిదా వేసుకుంటే.. న‌గ‌రంలో ఒకింత ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకునేవారు. కానీ, ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇక‌, ప‌వ‌న్‌ను చూసేందుకు వ‌చ్చిన అభిమానులు సైతం.. దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌నే టాక్ ఉంది. వెర‌సి.. మొత్తంగా.. విశాఖ ఇప్పుడు అట్టుడుకుతోంది. దీంతో అంతిమంగా.. త‌మ‌కు రాజ‌ధాని అవ‌స‌రం లేద‌నే దిశ‌గా ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నా.. ఆశ్చ‌ర్యంలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 16, 2022 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

30 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago