అత్యంత ఇంపార్టెంట్గా ముందుకు సాగుతున్న తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక.. అధికార పార్టీకి ప్రాణసంకటంగా మారింది. ఇక్కడ గెలిచి తీరాల్సిన అవసరం.. గెలుపుగుర్రం ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. తెలిసిందే. అయితే.. అధికార పార్టీ తరఫున జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలు.. పార్టీ ని ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా మంత్రి, రాజకీయంగా.. ఏవిషయాన్నయినా.. సమర్థవంతంగా డీల్ చేయగల నాయకుడుగా పేరున్న.. కేటీఆర్ తడబడ్డారు.
మునుగోడులో ఈ రోజు .. తొలిసారి పర్యటించిన..ఆయన పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినే షన్ ఘట్టంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. మునుగోడును గెలిపిస్తే.. అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. జనాలు భారీగా వచ్చారనే సంతోషంలోనో..లేక.. తనపై మరింత విశ్వసనీ యతను పెంచాలని అనుకున్నారో.. తెలియదు కానీ.. తడబడ్డారు.
తను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిశిల్ల నియోజకవర్గం తరహాలో మునుగోడుపై సమీక్షలు చేస్తానని.. అభి వృద్ధిని పరుగులు పెట్టిస్తానని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన అలా అన్నారో లేదో..ఇ లా నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
‘మీ పార్టీ గెలిచిన నియోజకవర్గాన్ని మాత్రమేఅభివృద్ధి చేస్తారా?’ అని కొందరు అంటే.. మరికొందరు.. ‘మునుగోడు అభివృద్ది అందుకే నిలిచిపోయిందా?’ అని పెదవి విరిచిన వారు మరికొందరు. “మీరు ఒక్క సరిసిల్లకు మాత్రమే మంత్రికాదు కేటీఆర్ సర్.. రాష్ట్రం మొత్తానికి మంత్రి” అని వ్యాఖ్యానించిన వారు ఇంకొందరు ఉన్నారు. “మంత్రిగా ఆలోచించండి సర్.. కేవలం పార్టీ కార్యకర్తగా కాదు.. ” అని మరికొందరు.. వ్యాఖ్యలు గుప్పించారు. మొత్తానికి అధికారంలో ఉన్న వారు.. మరీముఖ్యంగా ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారు.. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో.. ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
This post was last modified on October 13, 2022 8:12 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…