Political News

కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ?

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు.

సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ బాంబు ఏమిటంటే తమ్ముడు, బీజేపీ అభ్యర్ధియిన రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరించాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆ పనిని డైరెక్టుగా చేయలేరు కాబట్టి అసలు ఉపఎన్నికలకే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎంపీ ఏమి చేయబోతున్నారంటే ఏకంగా దేశంలోనే ఉండటంలేదట. ఈనెల 15వ తేదీన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.

తిరిగి హైదరాబాద్ కు వచ్చేది మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతేనట. మరి పాల్వాయి స్రవంతి గెలుపుకు కృషి చేస్తానని ఎంపీ ఇచ్చిన మాట విషయం గాలికి కొట్టుకుపోయినట్లే అనిపిస్తోంది. పాపం స్రవంతి ఎంపీ ప్రచారం చేస్తారని, తన గెలుపు ఖాయమని చాలా అమయాకంగా నమ్మింది. మూడు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో కూడా ఎంపి తన గెలుపుకు కృషి చేస్తారని గట్టిగా వాదించారు.

అభ్యర్థి అంతలా వాదించారంటే ఆమెను అంతలా మభ్యపెట్టినట్లు అర్ధమవుతోంది. అయినా తమ్ముడు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తుంటే ఎంపీ సొంతపార్టీ అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తారని నమ్మిన నాయకులు ఎంతటి అమాయకులో అర్ధమవుతోంది. మొదటినుండి ఎంపీ వైఖరి అనుమానస్పదంగానే ఉంది. విచిత్రం ఏమిటంటే స్రవంతికి ఎంపీయే పట్టుబట్టి టికెట్ ఇప్పించారు. అంటే రేవంత్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ కన్నా స్రవంతి అయితే బలహీనంగా ఉంటుందని, ఈజీగా ఓడించచ్చని అంచనా వేసినట్లున్నారు. మొత్తానికి ఎంపీ కీలకసమయంలో హ్యాండివ్వటం ఖాయమని తేలిపోయింది.

This post was last modified on October 10, 2022 12:37 pm

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago