మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ బాంబు ఏమిటంటే తమ్ముడు, బీజేపీ అభ్యర్ధియిన రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరించాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆ పనిని డైరెక్టుగా చేయలేరు కాబట్టి అసలు ఉపఎన్నికలకే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎంపీ ఏమి చేయబోతున్నారంటే ఏకంగా దేశంలోనే ఉండటంలేదట. ఈనెల 15వ తేదీన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.
తిరిగి హైదరాబాద్ కు వచ్చేది మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతేనట. మరి పాల్వాయి స్రవంతి గెలుపుకు కృషి చేస్తానని ఎంపీ ఇచ్చిన మాట విషయం గాలికి కొట్టుకుపోయినట్లే అనిపిస్తోంది. పాపం స్రవంతి ఎంపీ ప్రచారం చేస్తారని, తన గెలుపు ఖాయమని చాలా అమయాకంగా నమ్మింది. మూడు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో కూడా ఎంపి తన గెలుపుకు కృషి చేస్తారని గట్టిగా వాదించారు.
అభ్యర్థి అంతలా వాదించారంటే ఆమెను అంతలా మభ్యపెట్టినట్లు అర్ధమవుతోంది. అయినా తమ్ముడు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తుంటే ఎంపీ సొంతపార్టీ అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తారని నమ్మిన నాయకులు ఎంతటి అమాయకులో అర్ధమవుతోంది. మొదటినుండి ఎంపీ వైఖరి అనుమానస్పదంగానే ఉంది. విచిత్రం ఏమిటంటే స్రవంతికి ఎంపీయే పట్టుబట్టి టికెట్ ఇప్పించారు. అంటే రేవంత్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ కన్నా స్రవంతి అయితే బలహీనంగా ఉంటుందని, ఈజీగా ఓడించచ్చని అంచనా వేసినట్లున్నారు. మొత్తానికి ఎంపీ కీలకసమయంలో హ్యాండివ్వటం ఖాయమని తేలిపోయింది.
This post was last modified on October 10, 2022 12:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…