మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ బాంబు ఏమిటంటే తమ్ముడు, బీజేపీ అభ్యర్ధియిన రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరించాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆ పనిని డైరెక్టుగా చేయలేరు కాబట్టి అసలు ఉపఎన్నికలకే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎంపీ ఏమి చేయబోతున్నారంటే ఏకంగా దేశంలోనే ఉండటంలేదట. ఈనెల 15వ తేదీన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.
తిరిగి హైదరాబాద్ కు వచ్చేది మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతేనట. మరి పాల్వాయి స్రవంతి గెలుపుకు కృషి చేస్తానని ఎంపీ ఇచ్చిన మాట విషయం గాలికి కొట్టుకుపోయినట్లే అనిపిస్తోంది. పాపం స్రవంతి ఎంపీ ప్రచారం చేస్తారని, తన గెలుపు ఖాయమని చాలా అమయాకంగా నమ్మింది. మూడు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో కూడా ఎంపి తన గెలుపుకు కృషి చేస్తారని గట్టిగా వాదించారు.
అభ్యర్థి అంతలా వాదించారంటే ఆమెను అంతలా మభ్యపెట్టినట్లు అర్ధమవుతోంది. అయినా తమ్ముడు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తుంటే ఎంపీ సొంతపార్టీ అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తారని నమ్మిన నాయకులు ఎంతటి అమాయకులో అర్ధమవుతోంది. మొదటినుండి ఎంపీ వైఖరి అనుమానస్పదంగానే ఉంది. విచిత్రం ఏమిటంటే స్రవంతికి ఎంపీయే పట్టుబట్టి టికెట్ ఇప్పించారు. అంటే రేవంత్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ కన్నా స్రవంతి అయితే బలహీనంగా ఉంటుందని, ఈజీగా ఓడించచ్చని అంచనా వేసినట్లున్నారు. మొత్తానికి ఎంపీ కీలకసమయంలో హ్యాండివ్వటం ఖాయమని తేలిపోయింది.
This post was last modified on October 10, 2022 12:37 pm
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…