మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ బాంబు ఏమిటంటే తమ్ముడు, బీజేపీ అభ్యర్ధియిన రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరించాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆ పనిని డైరెక్టుగా చేయలేరు కాబట్టి అసలు ఉపఎన్నికలకే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎంపీ ఏమి చేయబోతున్నారంటే ఏకంగా దేశంలోనే ఉండటంలేదట. ఈనెల 15వ తేదీన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.
తిరిగి హైదరాబాద్ కు వచ్చేది మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతేనట. మరి పాల్వాయి స్రవంతి గెలుపుకు కృషి చేస్తానని ఎంపీ ఇచ్చిన మాట విషయం గాలికి కొట్టుకుపోయినట్లే అనిపిస్తోంది. పాపం స్రవంతి ఎంపీ ప్రచారం చేస్తారని, తన గెలుపు ఖాయమని చాలా అమయాకంగా నమ్మింది. మూడు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో కూడా ఎంపి తన గెలుపుకు కృషి చేస్తారని గట్టిగా వాదించారు.
అభ్యర్థి అంతలా వాదించారంటే ఆమెను అంతలా మభ్యపెట్టినట్లు అర్ధమవుతోంది. అయినా తమ్ముడు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తుంటే ఎంపీ సొంతపార్టీ అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తారని నమ్మిన నాయకులు ఎంతటి అమాయకులో అర్ధమవుతోంది. మొదటినుండి ఎంపీ వైఖరి అనుమానస్పదంగానే ఉంది. విచిత్రం ఏమిటంటే స్రవంతికి ఎంపీయే పట్టుబట్టి టికెట్ ఇప్పించారు. అంటే రేవంత్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ కన్నా స్రవంతి అయితే బలహీనంగా ఉంటుందని, ఈజీగా ఓడించచ్చని అంచనా వేసినట్లున్నారు. మొత్తానికి ఎంపీ కీలకసమయంలో హ్యాండివ్వటం ఖాయమని తేలిపోయింది.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…