ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే! గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ.. టీడీపీ సీనియర్ నేత.. రాయపాటి సాంబశివరావు త్వరలోనే .. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్త కమలదళంలో భారీ ఎత్తున హల్చల్ చేస్తోంది. పార్టీ సీనియర్ కావడం.. మంచి పలుకుబడి ఉండడం.. ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో ఇలాంటి వారికోసమే.. బీజేపీ ఎదురు చూస్తోంది. ఆయన గెలిచి.. మరో ఇద్దరిని గెలిపించగలిగితే.. చాలు.. అనే ధోరణిలో బీజేపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం రాయపాటి టీడీపీలోనే ఉన్నారు..కానీ, ఆయనను టీడీపీ పట్టించుకోవడం లేదని.. ఆయన వర్గం చెబుతోంది. ఎందుకంటే.. మహానాడుకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు రంగారావుకు.. సత్తెనపల్లి టికెట్ కోరుతున్నారు. తనకు నరసారావుపేట ఎంపీ టికెట్ అడుగుతున్నారు అయితే.. రాయపాటి కుటుంబానికి ఏదో ఒకటే ఇస్తామని..నిన్న మొన్నటి వరకు కూడా.. టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పడు ఏదీ ఇచ్చేది లేదని..అంటున్నారని.. రాయపాటి వర్గంలో గుసగుస వినిపిస్తోంది.
ఇటీవల రాయపాటి.. టీడీపీపై జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీ 125 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని అన్నారు. అంతేకాదు.. ఒంటరిగా పోటీ చేసినా.. ఇదే ఫలితం వస్తుందని అన్నారు. అయితే.. దీనిపై టీడీపీ నేతలు ఒక్కరంటే.. ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో మానసికంగా.. ఒకింత ఇబ్బంది పడిన రాయపాటి.. టీడీపీ అనుకూల మీడియా కూడా.. తనను దూరం పెట్టిందని.. వాపోయారు. ట్వీట్టర్ వేదికగా.. ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అనుచరుడు.. గుంటూరుకు చెందిన ఒక నేతతో రాయపాటి సంభాషించారని.. తనకు అభ్యంతరం లేదని.. అయితే.. తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని.. ఆయన కోరినట్టు గుంటూరులో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై కసరత్తు నడుస్తోందని.. సంక్రాంతి నాటికి.. ఏదో ఒక నిర్ణయం తీసుకుని.. బీజేపీ ప్రకటించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా టీడీపీ సైలెంట్ కావడం గమనార్హం. మరి రాయపాటిని వదులుకునేందుకు టీడీపీ రెడీగానే ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 9, 2022 10:04 pm
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…