దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిందంటే చాలు దానివెనుక బీజేపీ హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిందిదే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ విచారించింది కాబట్టే. హైదరాబాద్ లో ఈడీ అధికారులు జేసీని సుమారు 8 గంటల పాటు విచారించారు.
అశోక్ లేల్యాండ్ నుండి 126 బస్సుల స్క్రాప్ కొనుగోలు వ్యవహారంలో జేసీ మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారనేది ఈడీ ఉన్నతాధికారుల అనుమానం. మరిది అనుమానమేనా లేకపోతే నిజముందా అన్నది తెలీటంలేదు. విచారణ తర్వాత మీడియాతో జేసీ మాట్లాడుతూ స్క్రాప్ కొనుగోలులో మనీ ల్యాండరింగ్ ఏమీ జరగలేదని తాను సమాధానమిచ్చినట్లు చెప్పారు. అంటే మనీల్యాండరింగ్ వ్యవహారంపై విచారణ జరిగినట్లు అర్ధమవుతోంది.
స్క్రాప్ కొనుగోలు సందర్భంగా కొన్నిపత్రాలపై జేసీ పెట్టిన సంతకాలు ఫోర్జరీ అనే ఆరోపణల విచారణకు ఈడీ రావాల్సిన అవసరంలేదు. ఎవరి సంతకాలనో జేసీ ఫోర్జరీ చేశారనో లేకపోతే చేయించారనో ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈడీ జరిపిన విచారణ అంతా మనీ ల్యాండరింగ్ వ్యవహారంలోనే అని తేలిపోయింది. ఎప్పటినుండో ఆరోపణలున్నా సరిగ్గా ఇప్పుడే ఈడీ ఎందుకు సీన్లోకి ఎంటరైంది ? ఎందుకంటే జేసీలపై ఒత్తిడి పెట్టి లొంగదీసుకోవటమే వ్యూహంగా కనబడుతోందనే ఆరోపణలు మొదలయ్యాయి.
జేసీ బ్రదర్స్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతున్నది. అయితే ఆ విషయమై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతలో కేసీయార్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ లో జేసీలు చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. జేసీలపై ఒత్తిడిపెట్టి తమపార్టీలోకి లాక్కోవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీయే వెనకనుండి ఈడీతో దాడులు చేయిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరక నిజమో తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
This post was last modified on October 8, 2022 12:04 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…