Political News

జేసీ దివాకర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బీజేపీ

దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిందంటే చాలు దానివెనుక బీజేపీ హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిందిదే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ విచారించింది కాబట్టే. హైదరాబాద్ లో ఈడీ అధికారులు జేసీని సుమారు 8 గంటల పాటు విచారించారు.

అశోక్ లేల్యాండ్ నుండి 126 బస్సుల స్క్రాప్ కొనుగోలు వ్యవహారంలో జేసీ మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారనేది ఈడీ ఉన్నతాధికారుల అనుమానం. మరిది అనుమానమేనా లేకపోతే నిజముందా అన్నది తెలీటంలేదు. విచారణ తర్వాత మీడియాతో జేసీ మాట్లాడుతూ స్క్రాప్ కొనుగోలులో మనీ ల్యాండరింగ్ ఏమీ జరగలేదని తాను సమాధానమిచ్చినట్లు చెప్పారు. అంటే మనీల్యాండరింగ్ వ్యవహారంపై విచారణ జరిగినట్లు అర్ధమవుతోంది.

స్క్రాప్ కొనుగోలు సందర్భంగా కొన్నిపత్రాలపై జేసీ పెట్టిన సంతకాలు ఫోర్జరీ అనే ఆరోపణల విచారణకు ఈడీ రావాల్సిన అవసరంలేదు. ఎవరి సంతకాలనో జేసీ ఫోర్జరీ చేశారనో లేకపోతే చేయించారనో ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈడీ జరిపిన విచారణ అంతా మనీ ల్యాండరింగ్ వ్యవహారంలోనే అని తేలిపోయింది. ఎప్పటినుండో ఆరోపణలున్నా సరిగ్గా ఇప్పుడే ఈడీ ఎందుకు సీన్లోకి ఎంటరైంది ? ఎందుకంటే జేసీలపై ఒత్తిడి పెట్టి లొంగదీసుకోవటమే వ్యూహంగా కనబడుతోందనే ఆరోపణలు మొదలయ్యాయి.

జేసీ బ్రదర్స్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతున్నది. అయితే ఆ విషయమై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతలో కేసీయార్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ లో జేసీలు చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. జేసీలపై ఒత్తిడిపెట్టి తమపార్టీలోకి లాక్కోవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీయే వెనకనుండి ఈడీతో దాడులు చేయిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరక నిజమో తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

This post was last modified on October 8, 2022 12:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజీ బాటలో రోజా సక్సెస్ అయ్యారా..?

ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…

2 hours ago

హెచ్‌సీయూపై కాంగ్రెస్ గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఆన్సర్ ఉందా..?

కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…

4 hours ago

తెలంగాణను మించిన స్పీడుతో ఏపీ

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…

8 hours ago

బాబు ఆనందం అంతా ఇంతా కాదు… ఎందుకంటే…

ఏపీ ముఖ్య‌మంత్రిగా కూట‌మి ప్ర‌భుత్వాన్ని చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబుకు 10 నెల‌లు పూర్తయ్యాయి. గ‌త ఏడాది జూన్…

9 hours ago

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

13 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

13 hours ago