Political News

నో విలీనం..మిత్రపక్షమంతే

జాతీయపార్టీ బీఆర్ఎస్ లో విలీనం విషయంలో జేడీఎస్ అగ్రనేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టమైన వివరణ ఇచ్చేశారు. తమ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని కొట్టేశారు. తమ రెండుపార్టీలు మిత్రపక్షాలేనని స్పష్టంగా చెప్పారు. కర్నాటక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు కుమారస్వామి చెప్పారు. 2023లో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోను తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోను రెండుపార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ముందుకు సాగుతాయన్నారు.

ఇప్పటివరకు తొందరలోనే బీఆర్ఎస్ లో జేడీఎస్ విలీనమైపోతుందనే ప్రచారానికి కుమారస్వామి తెరదించేశారు. మాజీ సీఎం చేసిన ప్రకటన కారణంగా కర్నాటకలో స్ధిరపడ్డ తెలుగువాళ్ళుండే ప్రాంతాలపైనే బీఆర్ఎస్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. బెంగుళూరు సిటీ, తుముకూరు, మైసూరు, హోస్పేట ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు జేడీఎస్ కొన్ని సీట్లను కేటాయించే అవకాశముంది.

ఎలాగూ కర్నాటకలో ఎప్పటినుండో తెలుగు సంఘాలు యాక్టివ్ గానే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ సంఘాల్లోని ముఖ్యుల ద్వారా పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ చర్యలు తీసుకునే అవకాశముందని ప్రచారం మొదలైంది. మరి తన సొంతంగా విస్తరించేందుకు బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటే జేడీఎస్ అంగీకరిస్తుందా ? అన్నదే పెద్ద పాయింట్. ఎందుకంటే ఏ పార్టీ కూడా తనంతట తానుగా ప్రత్యర్ధులను తయారుచేసుకోదు. ఓట్లు, సీట్లను ఇతర పార్టీలతో షేర్ చేసుకోవాలని అనుకోదు. ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయున్న పార్టీలతో షేర్ చేసుకోవటానికి మాత్రం ఎలాంటి అభ్యంతరాలుండదు.

కొత్తపార్టీని నెత్తిన పెట్టుకుని తనకు వస్తాయని అనుకునే ఓట్లు, సీట్లలో షేర్ ఇవ్వటమంటే కష్టమే. ప్రస్తుతం బీఆర్ఎస్-జేడీఎస్ వ్యవహారం ఎలాగ సాగుతుందనేది ఆసక్తిగా మారింది. స్ధానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికలో జరిగితే కానీ రెండుపార్టీల మైత్రి ఎంత బలంగా ఉందనే విషయంపై క్లారిటిరాదు. నిధులు, ప్రచారం, టికెట్ల ఫైనల్ చేయటం లాంటి అంశాలే కీలకపాత్ర పోషిస్తాయి. మరి రెండుపార్టీల మధ్య అవగాహన ఎంతుందో చూడాల్సిందే.

This post was last modified on October 7, 2022 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

4 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

4 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

5 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

6 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago