Political News

TDP : ఈసారి సూపర్ ఫాస్ట్ ఉందే

నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను చంద్రబాబునాయుడు దాదాపు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసేశారట. అంటే ఖరారు కానీ రెండు నియోజకవర్గాలపై పార్టీలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్ధిగా కేశినేని శివనాధ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ లేదా అయన కూతురు పోటీ చేయచ్చట. అభ్యర్థులను ఖరారు చేసేముందు చంద్రబాబు అనేకసార్లు సర్వేలు చేయించుకున్నారు. కొందరు నేతలతో ముఖాముఖి మాట్లాడారు. నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ పోటీ చేస్తారట.

అలాగే తిరువూరు నుంచి వాసం మునయ్య లేదా ఉప్పులేటి కల్పన లేదా డీవై దాసులో ఒకళ్ళు పోటీ చేస్తారు. ముగ్గురు కూడా పోటీకి రెడీ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ కేశినేని నాని పోటీ చేస్తారట. సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, బందరు అసెంబ్లీకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరానికి గద్దె అనూరాధ, పెడనకు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, పెనమలూరుకు బోడె ప్రసాద్, పామర్రుకు వర్లకుమార్ రాజ పేర్లు ఖరారయ్యాట.

గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేయలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్ధులు దొరకలేదా ? లేకపోతే జనసేనతో పొత్తు కుదురుతుందని అనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలను పొత్తుల్లో కేటాయించేస్తారా అన్నది తేలలేదు. మొత్తానికి రెండు మూడు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్నింటిలోను అభ్యర్దులు దాదాపు ఖరారైపోయినట్లే అన్నది వాస్తవం.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

37 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago