Political News

TDP : ఈసారి సూపర్ ఫాస్ట్ ఉందే

నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను చంద్రబాబునాయుడు దాదాపు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసేశారట. అంటే ఖరారు కానీ రెండు నియోజకవర్గాలపై పార్టీలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్ధిగా కేశినేని శివనాధ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ లేదా అయన కూతురు పోటీ చేయచ్చట. అభ్యర్థులను ఖరారు చేసేముందు చంద్రబాబు అనేకసార్లు సర్వేలు చేయించుకున్నారు. కొందరు నేతలతో ముఖాముఖి మాట్లాడారు. నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ పోటీ చేస్తారట.

అలాగే తిరువూరు నుంచి వాసం మునయ్య లేదా ఉప్పులేటి కల్పన లేదా డీవై దాసులో ఒకళ్ళు పోటీ చేస్తారు. ముగ్గురు కూడా పోటీకి రెడీ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ కేశినేని నాని పోటీ చేస్తారట. సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, బందరు అసెంబ్లీకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరానికి గద్దె అనూరాధ, పెడనకు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, పెనమలూరుకు బోడె ప్రసాద్, పామర్రుకు వర్లకుమార్ రాజ పేర్లు ఖరారయ్యాట.

గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేయలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్ధులు దొరకలేదా ? లేకపోతే జనసేనతో పొత్తు కుదురుతుందని అనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలను పొత్తుల్లో కేటాయించేస్తారా అన్నది తేలలేదు. మొత్తానికి రెండు మూడు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్నింటిలోను అభ్యర్దులు దాదాపు ఖరారైపోయినట్లే అన్నది వాస్తవం.

This post was last modified on October 6, 2022 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

35 minutes ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

1 hour ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

3 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

5 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

6 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

6 hours ago