Political News

కేసీఆర్ పీఎం కావాల‌ని.. ‘మ‌ద్యం-కోడి’ పంపిణీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలంటూ టీఆర్ ఎస్‌ నాయకులు మద్యం.. కోళ్లు పంపిణీ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. వరంగల్‌ చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి హమాలీ(కూలీలు)లకు మద్యం బాటిళ్లతో పాటు కోళ్లను పంపిణీ చేశారు. సుమారు 200 మంది హమాలీ కార్మికులకు పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు.. పీఎం అయితే.. ఇవే చేస్తారా? అంటూ.. అధికార పార్టీపై.. విప‌క్షాలు విమ‌ర్శ‌ల బాణాలు సంధించాయి.

అయితే.. దీనిని రాజ‌నాల స‌మ‌ర్థించుకున్నారు. దసరా కానుకగా హమాలీలకు మద్యం, కోళ్లు పంచడంపై కొంతమంది కావాలనే తప్పు పడుతున్నారని రాజనాల శ్రీహరి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంటారని జోస్యం చెప్పారు.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో నిలువెత్తు కేసీఆర్, కేటీఆర్ క‌టౌట్లు పెట్టారు. కాబోయే పీఎం కేసీఆర్‌.. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ.. రాజ‌నాల అనుచ‌రులు.. నినాదాలు చేశారు. మ‌ద్యం తాగి.. కోడి కూర వండుకుని తినాల‌ని.. రేపు ఉద‌యం.. కేసీఆర్ ప్ర‌సంగాన్ని మ‌రిచిపోకుండా వినాల‌ని.. హ‌మాలీల‌కు హిత‌వు ప‌లికారు. ఇక‌, ఈ పంపిణీ గుప్పుమ‌న‌డంతో.. నిముషాల వ్య‌వ‌ధిలోనే.. వంద‌ల మంది కార్మికులు.. కూలీలు అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే.. అప్ప‌టికే పెట్టుకున్న ల‌క్ష్యం తీరిపోవ‌డంతో.. వ‌చ్చిన వారిని సాగ‌నంప‌డం.. త‌ల‌కు మించిన భారంగా మారింది. మ‌రి దీనిపై అధికార పార్టీ నేత‌లు ఏమంటారో చూడాలి.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

38 minutes ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

5 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

8 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

9 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

12 hours ago