Political News

వ్యతిరేకతను పట్టించుకోని కేసీఆర్

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థి విషయంలో కేసీయార్ ఎవరినీ లెక్కచేయటం లేదు. ఉపఎన్నికలో పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలన్నది సీఎం ఆలోచన. అయితే సీఎం ఆలోచనతో స్ధానిక నేతల్లో అత్యధికులు తీవ్రంగా విభేదిస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము పనిచేసేదిలేదని డైరెక్టుగా కేసీయార్ కే తెగేసి చెప్పారు. దీంతో ఏమిచేయాలో అర్థం కాని కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డిని రంగంలోకి దింపారు.

కూసుకుంట్లకు అనుకూలంగా మద్దతు కూడగట్టాలని కేసీయార్ మంత్రికి ఇచ్చిన ఆదేశాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. గడచిన నెలరోజులుగా ప్రయత్నాలు జరగటం అవంతా ఫెయిలవ్వటం అందరు చూస్తున్నదే. సరే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినపుడు చూసుకుందామని అభ్యర్ధి విషయాన్ని వాయిదా వేశారు. ఇపుడు నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్ 3వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరగబోతోంది. ఈ నేపధ్యంలోనే అధికార పార్టీ అభ్యర్థి ఎంపిక వేడి ఒక్కసారిగా రాజుకుంది.

5వ తేదీ అంటే విజయదశమి రోజున టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా కేసీయార్ ప్రకటించబోతున్నారు. తర్వాత ప్రత్యేకంగా పార్టీ నేతలతో సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగానే మునుగోడులో పోటీ చేయబోయే అభ్యర్ధిని కేసీయార్ ప్రకటించబోతున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. కూసుకుంట్లనే అభ్యర్ధిగా కేసీయార్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంత వ్యతిరేకత ఉన్నా పార్టీ అభ్యర్ధి తన ఆలోచనల ప్రకారమే పోటీ చేస్తారని నేతలతో కేసీయార్ స్పష్టం చేశారట.

ఎవరో కొందరు వ్యతరేకించినంత మాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని కేసీయార్ గట్టిగా చెప్పారట. నేతల అభిప్రాయాలు, వ్యతిరేకత వల్ల నిర్ణయాలు తీసుకోవటం సాధ్యంకాదని కూడా సీఎం గట్టిగా అభిప్రాయపడ్డారట. సో పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఎంత వ్యతిరేకత ఉన్నా కేసీయార్ మాత్రం కూసుకుంట్లనే అభ్యర్ధిగా ప్రకటించబోతున్నారు. మరి కూసుకుంట్ల పోటీలోకి దిగిన తర్వాత లోకల్ నేతలు ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on October 4, 2022 12:54 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago