Political News

హైదరాబాద్ సిటీలో రాహుల్ మారథాన్ నడక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో 13 రోజులు ఉండబోతున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి రాహుల్ 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారిలో మొదలైన ఈ పాదయాత్ర కాశ్మీర్లో ముగుస్తుంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో యాత్ర పూర్తిచేసుకుని ఈనెల 24వ తేదీన తెలంగాణాలోకి ఎంటరవుతున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు రాహుల్ యాత్ర తెలంగాణాలోనే జరగబోతోంది.

వచ్చే నెల 6వ తేదీన మహారాష్ట్రలోకి ఎంటరవుతుంది. అంటే యాత్ర షెడ్యూల్ ప్రకారం మునుగోడు ఉపఎన్నిక జరిగే సమయానికి రాహుల్ తెలంగాణాలోనే ఉంటారు. అయితే ఉప ఎన్నిక ప్రచారానికి మాత్రం దూరంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ ప్రత్యేకంగా బహిరంగసభ నిర్వహించాలని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో అనుకుంటున్నది.

పాదయాత్ర రూట్ ను పర్యవేక్షిస్తున్న జై రామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు ఇదే విషయమై హైదరాబాద్ కు చేరుకున్నారు. వీళ్ళతో మునుగోడు ఉపఎన్నిక, శంషాబాద్ లో బహిరంగ సభ నిర్వహణ అంశాలను రేవంత్ అండ్ కో చర్చించారు. 13 రోజుల పాదయాత్రలో భాగంగానే హైదరాబాద్ పరిధిలోని ఆరాంఘర్, చార్మినార్, నాంపల్లి, పంజాగుట్ట, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు మీద సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

అంతర్గత కుమ్ములాటలతో తీవ్రంగా గొడవలు జరుగుతున్న నేపధ్యంలో రాహుల్ యాత్ర ఏమన్నా కొందరి నేతల్లో అయినా మార్పు తెస్తుందా అనేది అనుమానంగానే ఉంది. రాహుల్ యాత్ర విజయవంతానికి ఇపుడు నేతలంతా ఐకమత్యంగా కష్టపడుతున్నారు. అయితే పాదయాత్ర ముగియగానే నేతల ఆలోచనలు, ఆధిపత్య గొడవలతో మళ్ళీ యధాతథంగా మారిపోతారు. ఇదే పార్టీకి అసలైన సమస్యగా మారిపోయింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఇక్కడే ఉండబోతున్న రాహుల్ ఈ విషయంలో అయినా నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారా అని కొందరు ఎదురుచూస్తున్నారు.

This post was last modified on October 4, 2022 12:50 pm

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

1 hour ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

4 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

4 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago