Political News

హైదరాబాద్ సిటీలో రాహుల్ మారథాన్ నడక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో 13 రోజులు ఉండబోతున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి రాహుల్ 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారిలో మొదలైన ఈ పాదయాత్ర కాశ్మీర్లో ముగుస్తుంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో యాత్ర పూర్తిచేసుకుని ఈనెల 24వ తేదీన తెలంగాణాలోకి ఎంటరవుతున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు రాహుల్ యాత్ర తెలంగాణాలోనే జరగబోతోంది.

వచ్చే నెల 6వ తేదీన మహారాష్ట్రలోకి ఎంటరవుతుంది. అంటే యాత్ర షెడ్యూల్ ప్రకారం మునుగోడు ఉపఎన్నిక జరిగే సమయానికి రాహుల్ తెలంగాణాలోనే ఉంటారు. అయితే ఉప ఎన్నిక ప్రచారానికి మాత్రం దూరంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ ప్రత్యేకంగా బహిరంగసభ నిర్వహించాలని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో అనుకుంటున్నది.

పాదయాత్ర రూట్ ను పర్యవేక్షిస్తున్న జై రామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు ఇదే విషయమై హైదరాబాద్ కు చేరుకున్నారు. వీళ్ళతో మునుగోడు ఉపఎన్నిక, శంషాబాద్ లో బహిరంగ సభ నిర్వహణ అంశాలను రేవంత్ అండ్ కో చర్చించారు. 13 రోజుల పాదయాత్రలో భాగంగానే హైదరాబాద్ పరిధిలోని ఆరాంఘర్, చార్మినార్, నాంపల్లి, పంజాగుట్ట, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు మీద సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

అంతర్గత కుమ్ములాటలతో తీవ్రంగా గొడవలు జరుగుతున్న నేపధ్యంలో రాహుల్ యాత్ర ఏమన్నా కొందరి నేతల్లో అయినా మార్పు తెస్తుందా అనేది అనుమానంగానే ఉంది. రాహుల్ యాత్ర విజయవంతానికి ఇపుడు నేతలంతా ఐకమత్యంగా కష్టపడుతున్నారు. అయితే పాదయాత్ర ముగియగానే నేతల ఆలోచనలు, ఆధిపత్య గొడవలతో మళ్ళీ యధాతథంగా మారిపోతారు. ఇదే పార్టీకి అసలైన సమస్యగా మారిపోయింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఇక్కడే ఉండబోతున్న రాహుల్ ఈ విషయంలో అయినా నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారా అని కొందరు ఎదురుచూస్తున్నారు.

This post was last modified on October 4, 2022 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి షోలు…100 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

15 minutes ago

AI వాడి కరెంట్ బిల్లు తగ్గిస్తారా?

పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…

38 minutes ago

‘అఖండ’మైన నిర్ణయం తీసుకునే టైమొచ్చింది

అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…

1 hour ago

ఇండిగో: టికెట్ డబ్బులిస్తే సరిపోతుందా?

దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…

1 hour ago

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

3 hours ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

4 hours ago