వైసీపీ నిర్వహించిన తాజా అంతర్గత సర్వేలో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని.. తమకు తిరుగులేదని.. గత ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయని చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు..చేస్తున్న అప్పులు కూడా.. పేదల కోసం.. ప్రజల కోసమేనని చెబుతున్నది కూడా తెలిసిందే. దీంతో తమ గ్రాఫ్ దేదీప్యమానంగా విరాజిల్లుతోందని ప్రభు త్వ పెద్దలు చెబుతున్నారు.
అయితే.. తాజాగా పార్టీ చేయించిన అంతర్గత సర్వేలు.. ఐప్యాక్.. సంస్థ నిర్వహించిన ప్రజల అభిప్రాయాలను గమనిస్తే.. భిన్నమైన ఫలితం వచ్చిందట. సంక్షేమ పథకాలు అందుతున్న వారుకూడా.. సర్కారుపై అంత పాజిటీవ్గా లేరనేది సర్వేలు చెబుతున్న వాస్తవమని తేలిందట. ఎందుకంటే.. ప్రజలకు ఎన్ని చేసినా.. రెండు కారణాలను ప్రతిపక్షాలు.. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాయని.. వాటిపై ప్రజలు చర్చించుకుంటున్నారని.. తెలుస్తోంది.
ముఖ్యంగా.. జగన్ ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము.. కొందరికే(లబ్దిదారులు) అందుతోంది. అది కూడా.. అప్పు లు చేసి ఇస్తున్నామని.. ప్రభుత్వమే చెబుతోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారం.. మిగిలిన మెజారిటీ ప్రజలపైనే పడుతోంది. దీంతో వారిలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇక, జగన్ ఇస్తున్నది ఆయన జేబులో సొమ్ము కాదని.. ప్రజల ధనమేనని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కూడా బాగానే ఎక్కింది. ఇక, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తూ.. మరోవైపు పన్నుల రూపంలో గుంజుకుంటోందన్న విషయంపైగా ప్రజలు చర్చించుకుంటున్నారు.
ధరల పెరుగుదల, పన్నుల బాదుడు… మద్యం ధరలు.. ఇలా అనేక అంశాలపై ప్రజలు చర్చించుకుం టున్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమంపై పెద్దగా ఎవరూ సంతృప్తి వ్యక్తం చేయడం లేదేని సర్వేలో స్పష్టంగా తెలిసిందని సమాచారం. దీంతో ఇన్ని వేల కోట్లు అప్పులు చేసి.. కూడా.. ప్రజల నుంచి ఓట్లు పిండుకోలేక పోతే.. ఎలా.. అని తాడేపల్లి వర్గాలు.. ఆత్మరక్షణలో పడ్డాయని అంటున్నారు. మరి దీనిపై ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on October 3, 2022 10:55 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…