ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కరలేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం బండ్ల గణేష్ వార్తలో నిలుస్తుంటారు. ఇటీవల ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ నాగరాజుతో జరిగిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఫైర్ అయిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూరీ జగన్నాథ్ గురించి, పోసాని కృష్ణమురళి గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
అయితే, ఆ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి నాగరాజు అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అనిల్, బండ్లల మధ్య జరిగిన సంభాషణపై ఇప్పుడు భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్ కు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారని నాగరాజు ప్రశ్నించాారు. ఈ ప్రశ్న అడగడంతోనే బండ్ల గణేష్ వీరావేశంతో ఊగిపోయారు.
వెంటనే అనిల్ కుమార్ యాదవ్ కు బండ్ల గణేష్ ఫోన్ చేసి మాట్లాడారు. బండ్ల గణేష్ తో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ అన్న చెప్పన్నా అంటూ మాట్లాడడం వైరల్ అయింది. మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని నాగరాజు గారు అడుతున్నారు అంటూ బండ్ల గణేష్ చెప్పిన ప్రోమో ట్రెండ్ అవుతోంది. అనిల్ కుమార్ తో మాట్లాడిన తర్వాత బండ్ల గణేష్ ఇక్కడ…అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో దట్ ఈజ్ బండ్ల గణేష్ అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అట్లుంటది బండ్ల గణేష్ తోని అంటూ సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on October 1, 2022 9:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…