Political News

కేంద్రాన్ని కేసీయార్ ఇరుకున పెట్టారా ?

కేంద్ర ప్రభుత్వం-కేసీఆర్ మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీయార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేసీయార్ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయిలో జరుగుతోంది. నిజానికి ఈ మాటల యుద్ధం విదానపరమైన అంశాల మీద జరిగితే బాగానే ఉంటుంది.

కానీ జరుగుతున్న దాంట్లో అత్యధికం వెర్బల్ పొల్యూషన్ అనటంలో సందేహం లేదు. ఒకరిపై మరొకరు అనవసరమైన వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడచిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా దాంతో రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యను కేసీయార్ అమల్లోకి తెచ్చారు. దీంతో ఏమి చేయాలో బీజేపీ నేతలకు దిక్కుతోచటం లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు కేసీయార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నిజానికి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రిజర్వేషన్లన్నది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం. అయినా సరే గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 శాతానికి పెంచేసి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వచ్చేస్తుందని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇక్కడే కేంద్రం ఇబ్బందులో పడింది.

కేసీయార్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటు కేంద్రం చెప్పిందంటే గిరిజనుల మద్దతు బీజేపీ దక్కే అవకాశం లేదు. అలాగని ఏమీ మాట్లాడకుండా చూస్తు ఊరుకుంటే రిజర్వేషన్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ క్రెడిటంతా కేసీయార్ కే దక్కుతుంది. అంటే ఏరకంగా చూసినా బీజేపీకి ఇబ్బందనే చెప్పాలి. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు జారీచేసిన ఉత్తర్వులే వివాదాస్పదమై కోర్టు విచారణలో మగ్గుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు మొత్తం 62 శాతానికి చేరుతుంది. రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధం. మరిపుడు నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాల్సిందే.

This post was last modified on October 1, 2022 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

1 minute ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

3 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

4 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

4 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

6 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

8 hours ago