కేంద్ర ప్రభుత్వం-కేసీఆర్ మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీయార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేసీయార్ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయిలో జరుగుతోంది. నిజానికి ఈ మాటల యుద్ధం విదానపరమైన అంశాల మీద జరిగితే బాగానే ఉంటుంది.
కానీ జరుగుతున్న దాంట్లో అత్యధికం వెర్బల్ పొల్యూషన్ అనటంలో సందేహం లేదు. ఒకరిపై మరొకరు అనవసరమైన వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడచిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా దాంతో రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యను కేసీయార్ అమల్లోకి తెచ్చారు. దీంతో ఏమి చేయాలో బీజేపీ నేతలకు దిక్కుతోచటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు కేసీయార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నిజానికి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రిజర్వేషన్లన్నది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం. అయినా సరే గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 శాతానికి పెంచేసి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వచ్చేస్తుందని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇక్కడే కేంద్రం ఇబ్బందులో పడింది.
కేసీయార్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటు కేంద్రం చెప్పిందంటే గిరిజనుల మద్దతు బీజేపీ దక్కే అవకాశం లేదు. అలాగని ఏమీ మాట్లాడకుండా చూస్తు ఊరుకుంటే రిజర్వేషన్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ క్రెడిటంతా కేసీయార్ కే దక్కుతుంది. అంటే ఏరకంగా చూసినా బీజేపీకి ఇబ్బందనే చెప్పాలి. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు జారీచేసిన ఉత్తర్వులే వివాదాస్పదమై కోర్టు విచారణలో మగ్గుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు మొత్తం 62 శాతానికి చేరుతుంది. రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధం. మరిపుడు నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాల్సిందే.
This post was last modified on October 1, 2022 11:00 am
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…