తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యే వారికి ఈ పేరు సుపరిచితమే. టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న సంతోష్ కుమార్….తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా. కేసీఆర్ సతీమణి తరఫు బంధువైన సంతోష్ కుమార్…చాలా కాలంగా కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ ఆయనకు ఆంతరంగికుడిగా పాపులర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో సంతోష్ కుమార్ ను కేసీఆర్ మందలించినట్టుగా పుకార్లు వచ్చాయి.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కూడా ఆ పుకార్లకు ఊతమిచ్చింది. దాంతోపాటు కొద్దిరోజులుగా కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడానికి కూడా సంతోష్ హాజరు కాకపోవడంతో కేసీఆర్, సంతోష్ ల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ లిక్కర్ స్కాం నేపథ్యంలో సంతోష్ తో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ అధికారులు విచారణ జరిపారు.
అయితే, వెన్నమనేనితో కలిసి సంతోష్ పలు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో, ఆ విచారణ తర్వాత కేసీఆర్ తో సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ ను కేసీఆర్ మందలించారని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ తర్వాతే సంతోష్ తన ఫోన్ స్విచాఫ్ చేశారని ప్రచారం జరుగుతోంది. గత మూడు రోజులుగా సంతోష్ తన విధులకు, పార్టీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే, ఈ పుకార్లను కొందరు టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరికొందరేమో వేరే విషయంలో సంతోష్ ను కేసీఆర్ కాస్త మందలించారని, అందుకే గ్యాప్ వచ్చిందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా..ఈ టీ కప్పులో తుఫాను సంగతేంటో తేలాలంటే కాస్త వేచి చూడక తప్పదు.
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…