Political News

కేసీఆర్, ఎంపీ సంతోష్ ల మధ్య గ్యాప్?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యే వారికి ఈ పేరు సుపరిచితమే. టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న సంతోష్ కుమార్….తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా. కేసీఆర్ సతీమణి తరఫు బంధువైన సంతోష్ కుమార్…చాలా కాలంగా కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ ఆయనకు ఆంతరంగికుడిగా పాపులర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో సంతోష్ కుమార్ ను కేసీఆర్ మందలించినట్టుగా పుకార్లు వచ్చాయి.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కూడా ఆ పుకార్లకు ఊతమిచ్చింది. దాంతోపాటు కొద్దిరోజులుగా కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడానికి కూడా సంతోష్ హాజరు కాకపోవడంతో కేసీఆర్, సంతోష్ ల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ లిక్కర్ స్కాం నేపథ్యంలో సంతోష్ తో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ అధికారులు విచారణ జరిపారు.

అయితే, వెన్నమనేనితో కలిసి సంతోష్ పలు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో, ఆ విచారణ తర్వాత కేసీఆర్ తో సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ ను కేసీఆర్ మందలించారని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ తర్వాతే సంతోష్ తన ఫోన్ స్విచాఫ్ చేశారని ప్రచారం జరుగుతోంది. గత మూడు రోజులుగా సంతోష్ తన విధులకు, పార్టీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే, ఈ పుకార్లను కొందరు టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరికొందరేమో వేరే విషయంలో సంతోష్ ను కేసీఆర్ కాస్త మందలించారని, అందుకే గ్యాప్ వచ్చిందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా..ఈ టీ కప్పులో తుఫాను సంగతేంటో తేలాలంటే కాస్త వేచి చూడక తప్పదు.

This post was last modified on September 28, 2022 10:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

12 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

48 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago