కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఖాతాలో టీఆర్ఎస్ మొదటి వికెట్ పడిందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఇబ్రహింపట్నం ఎంఎల్ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం విచారణకు పిలిపించిన ఉన్నతాధికారులు సుమారు తొమ్మిది గంటలపాటు విచారించారు.
కొద్దిరోజుల క్రితం క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు ప్రముఖులను తీసుకెళ్ళినట్లు ఆరోపణలు వచ్చాయి. చికోటితో రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొందరు నేపాల్, శ్రీలంక, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియాకు రెగ్యులర్ గా వెళ్ళి క్యాసినోల్లో ఆడివస్తారనేది సమాచారం. అయితే ఓడిపోతే ఓకే అదే గెలిస్తే అక్కడినుండి మన దేశంలోకి డబ్బులు ఎలాగ తీసుకొస్తారు ? ఇక్కడే చికోటి ద్వారా క్యాసినో గెలుసుకున్న ప్రముఖులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.
క్యాసినో విషయంలోనే చికోటితో పాటు చాలామంది ప్రముఖులను ఈడీ ఇప్పటికే విచారించింది. ఇందులో భాగంగానే మంచిరెడ్డిని విచారిస్తున్నది. అయితే మంచిరెడ్డి వ్యాపార పనులపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు వెళ్ళివచ్చినట్లు కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. విదేశాల్లోని ఒక గోల్డ్ మైన్ లో పెట్టుబడులపై ఈడీ గతంలోనే మంచిరెడ్డికి నోటీసులిచ్చి విచారించింది.
అయితే అప్పట్లో ఎంఎల్ఏ సరైన సమాధానాలు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తోంది. బహుశా ఈ విషయంలో కూడా విచారణ జరుగుతున్నదేమో. ఢిల్లీలో జరిగినట్లుగా ఆరోపణలున్న లిక్కర్ స్కామ్ లో తెలంగాణాలోని అధికార పార్టీ ప్రముఖులపై ఈడీ కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లిక్కర్ స్కామ్ లో కాకుండా క్యాసినో అని విదేశాల్లో వ్యాపారాలని ఏదో కారణంతో ఈడీ టీఆర్ఎస్ ఎంఎల్ఏని విచారణ చేయటం కలకలం రేపుతోంది. మొత్తానికి ఏదో పద్దతిలో ప్రముఖులను అదుపులోకి తీసుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. చూడాలి చివరకు ఏమవుతుందో.
This post was last modified on September 28, 2022 10:46 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…