Political News

ముగ్గురు మాజీ మంత్రుల‌కు.. ప‌వ‌న్ షాకిస్తారా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఆదిశ‌గా అడుగులు వేగంగా వేస్తోంది. త్వ‌ర‌లోనే జిల్లా స్తాయిలో స‌మీక్ష‌లు చేస్తాన‌ని.. స్వ‌యంగా పవ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు. పైగా.. త‌న బ‌స్సు యాత్ర‌ను కూడా ఆయ‌న వాయిదా వేసుకున్నారు. ఈ ప‌రిణామాలతో.. జ‌న‌సేన‌లో ఉత్సాహం పెరిగింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ఒక‌వైపు పార్టీని గెలిపించ‌డంతోపాటు.. త‌ర‌చుగా.. త‌న‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీ నాయ‌కులకు చెక్ పెట్టాల‌ని కూడా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించుకున్నట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇలా.. ప‌వ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డిన వారిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ దూకుడుగా ముందుకు సాగుతున్నార‌ని.. అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని.. మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌ధానంగా విజ‌య‌వాడ‌లోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం, మ‌చిలీప‌ట్నం.. అదేవిధంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌ట్టు పెంచుకుని,, గెలుపు గుర్రం ఎక్కాల‌ని.. ప్లాన్ రెడీ చేసుకుంటున్నార‌ని.. అంటున్నారు. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న‌వారు.. జ‌గ‌న్ తొలి మంత్రివ‌ర్గంలో మంత్రులుగా ప‌నిచేశారు.

గుడివాడ నుంచి కొడాలి నాని, మ‌చిలీప‌ట్నం నుంచి పేర్ని నాని.. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌లు.. జ‌గ‌న్ ఫ‌స్ట్ కేబినెట్‌లో ప‌నిచేశారు. త‌ర్వాత‌.. రెండోసారి.. వారికి ఛాన్స్ ద‌క్క‌లేదు. అయితే.. మంత్రులుగా ఉన్న స‌మ‌యంలో ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌. మంత్రి ప‌ద‌వులు లేక‌పోయినా వారు రెచ్చిపోయారు. ప్ర‌స్తుతం మంత్రులుగా లేక‌పోయినా.. వారి దూకుడు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి చెక్ పెట్టాల‌ని. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం ఏంట‌ని..ప‌వ‌న్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇక‌.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా జ‌న‌సేన బ‌లం చూస్తే. విజ‌య‌వాడ‌ ప‌శ్చిమలో జ‌న‌సేన‌కు మిశ్ర‌మ స్పంద‌న ఉంది. ఇక్క‌డ మాజీ మంత్రి వెల్లంప‌ల్లికి వ్య‌తిరేకంగా.. ప‌రిస్థితి మారిపోయింది. అదేస‌మ‌యంలో ఆయ‌న జ‌న‌సేన నేత‌.. పోతిన మ‌హేష్ పుంజుకుంటున్నారు. దీంతో ఇక్క‌డ అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌చిలీప‌ట్నంలో.. జ‌న‌సేన దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. కాపు ఓట్ల‌ను స‌మీక‌రించ‌గ‌లిగితే.. ఇక్క‌డ గెలుపు పెద్ద క‌ష్టం కాదు. అయితే..ఎటొచ్చీ.. గుడివాడ‌లో క‌మ్మ‌ల ఓట్లు ప‌డ‌డ‌మే ఇబ్బంది. అయితే..ఇక్క‌డ యూత్‌ను మెగా అభిమానుల‌ను స‌మీకరిస్తే.. జ‌న‌సేనాని వ్యూహం ఫ‌లిస్తుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

This post was last modified on September 25, 2022 10:47 am

Share
Show comments

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

34 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago