ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక పెద్ద వివాదం ఏదో నడుస్తుంటుంది. ఓవైపు మీడియా, మరోవైపు ప్రతిపక్షాలు ముప్పేట దాడితో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రభుత్వం దగ్గర డిఫెన్స్ ఉండదు. జనాల్లోకి చెడు సంకేతాలు వెళ్తున్నట్లు, తమకు డ్యామేజ్ జరగబోతున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడే ఇంకో ఒక కొత్త వివాదాన్ని తెరమీదికి తెస్తుంది ప్రభుత్వం. అందరి దృష్టి అటు మళ్లుతుంది. అంతే.. అప్పటిదాకా హాట్ టాపిక్గా ఉన్న అంశం మరుగున పడిపోతుంది.
కొత్త వివాదం వల్ల కూడా కొంచెం కష్టం ఉన్నట్లు అనిపించినా.. ఎక్కువ డ్యామేజ్ జరిగే పాత వ్యవహారం మరుగున పడినందుకు ఊపిరి పీల్చుకుంటుంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన కొంత కాలం నుంచి జరుగుతున్న తంతు ఇది. డైవర్షన్ పాలిటిక్స్ విషయంలో తమను మించిన వారు లేరు అన్నట్లుగా జగన్ అండ్ కో వేస్తున్న ఎత్తుగడలు చూస్తే ఎవ్వరైనా విస్తుబోవాల్సిందే.
తాజాగా అమరావతి వ్యవహారం మీద ఇటు అసెంబ్లీలో, అటు మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుండగా.. తమ స్టాండ్ను బలంగా చెప్పలేక ఇబ్బంది పడింది వైసీపీ ప్రభుత్వం. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా వైసీపీ సర్కారు మెడకు చుట్టుకోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఐతే ఈ రెండు వివాదాలు ఒక్క రోజులో పక్కకు వెళ్లిపోయాయి.
విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టే దిశగా బిల్లు ప్రవేశ పెట్టడంతో అందరి దృష్టి అటు మళ్లింది. ప్రతిపక్షాలు, మీడియా అందరూ దాని మీద గొడవ చేయడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లోనూ దాని మీదే విపరీతమైన చర్చ జరుగుతోంది. దీంతో అమరావతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారాల నుంచి అందరినీ డైవర్ట్ చేయడంలో జగన్ అండ్ కో గొప్ప విజయం సాధించారనే చెప్పాలి. కాకపోతే ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారంతో జరిగే డ్యామేజీ ఎంత అన్నది కూడా కాస్త చూసుకుంటే బెటరేమో.
This post was last modified on September 23, 2022 10:14 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…