YS Jagan Mohan Reddy
రాష్ట్రంలో ప్రతిపక్షాలను కలిపిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటి పేరును ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇది అనవసరమైన ప్రక్రియే అయినా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరీ మార్పు చేశారు. పేరు మార్పుకు జగన్ చెప్పిన కారణాలు తన యాంగిల్లో ఓకేనే కానీ మామూలుగా అయితే పెద్దగా అతకటంలేదు.
ఈ నేపధ్యంలోనే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. పేరుమార్పు రాజకీయానికి వ్యతిరేకంగా టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా తోడయ్యారు. వీళ్ళే కాకుండా వామపక్షాలు, శాసనమండలిలో పీడీఎఫ్ ఎంఎల్సీ కూడా నిరసన వ్యక్తంచేశారు. జగన్ కు వ్యతిరేకంగా చాలా విషయాల్లో టీడీపీ, జనసేనలు కలుస్తునే ఉన్నాయి. అయితే టీడీపీతో ఎక్కడా కలవటంలేదు. సమాంతరంగా తన పనేదో బీజేపీ చేసుకుపోతోంది.
కానీ ఈ విషయంలో మాత్రం టీడీపీతో బీజేపీ నేతలు కూడా నిరసన గొంతుకలిపారు. వామపక్షాల్లో సీపీఐ ఎలాగూ చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతోంది కాబట్టి ఇపుడు మద్దతు తెలపటంలో వింతేమీలేదు. ఎవరెంత డిమాండ్ చేసినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తొలగించాల్సిన అవసరం ఏమిటనేది కీలకమైంది. నిజంగా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న పాయింట్ అర్ధవంతమైనదే.
ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టినంత మాత్రాన వైసీపీకి వచ్చే ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. పథకాలకు, కార్యక్రమాలకు పేర్ల ఏవిపెట్టినా జనాలకు పెద్దగా పట్టింపు ఉండదు. కాకపోతే అవి అమలవుతున్న పద్దతే కీలకమైనది. ఇపుడు హెల్త్ యూనివర్సిటి పేరు మార్పు విషయంలో ప్రతిపక్షాలను ఏకంచేసిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుందని చెప్పటంలో సందేహంలేదు. కేంద్రంలో నరేంద్రమోడీ వెళుతున్న దారిలోనే రాష్ట్రంలో జగన్ వెళుతున్నారేమో.
This post was last modified on September 22, 2022 1:41 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…