YS Jagan Mohan Reddy
రాష్ట్రంలో ప్రతిపక్షాలను కలిపిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటి పేరును ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇది అనవసరమైన ప్రక్రియే అయినా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరీ మార్పు చేశారు. పేరు మార్పుకు జగన్ చెప్పిన కారణాలు తన యాంగిల్లో ఓకేనే కానీ మామూలుగా అయితే పెద్దగా అతకటంలేదు.
ఈ నేపధ్యంలోనే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. పేరుమార్పు రాజకీయానికి వ్యతిరేకంగా టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా తోడయ్యారు. వీళ్ళే కాకుండా వామపక్షాలు, శాసనమండలిలో పీడీఎఫ్ ఎంఎల్సీ కూడా నిరసన వ్యక్తంచేశారు. జగన్ కు వ్యతిరేకంగా చాలా విషయాల్లో టీడీపీ, జనసేనలు కలుస్తునే ఉన్నాయి. అయితే టీడీపీతో ఎక్కడా కలవటంలేదు. సమాంతరంగా తన పనేదో బీజేపీ చేసుకుపోతోంది.
కానీ ఈ విషయంలో మాత్రం టీడీపీతో బీజేపీ నేతలు కూడా నిరసన గొంతుకలిపారు. వామపక్షాల్లో సీపీఐ ఎలాగూ చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతోంది కాబట్టి ఇపుడు మద్దతు తెలపటంలో వింతేమీలేదు. ఎవరెంత డిమాండ్ చేసినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తొలగించాల్సిన అవసరం ఏమిటనేది కీలకమైంది. నిజంగా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న పాయింట్ అర్ధవంతమైనదే.
ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టినంత మాత్రాన వైసీపీకి వచ్చే ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. పథకాలకు, కార్యక్రమాలకు పేర్ల ఏవిపెట్టినా జనాలకు పెద్దగా పట్టింపు ఉండదు. కాకపోతే అవి అమలవుతున్న పద్దతే కీలకమైనది. ఇపుడు హెల్త్ యూనివర్సిటి పేరు మార్పు విషయంలో ప్రతిపక్షాలను ఏకంచేసిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుందని చెప్పటంలో సందేహంలేదు. కేంద్రంలో నరేంద్రమోడీ వెళుతున్న దారిలోనే రాష్ట్రంలో జగన్ వెళుతున్నారేమో.
This post was last modified on September 22, 2022 1:41 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…