వేరేదారి లేక వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చివరకు సెంటిమెంటునే అస్త్రంగా ప్రయోగిస్తున్నారా ? ఇపుడిదే సందేహం అందరిలోను పెరిగిపోతోంది. తాజాగా మీడియాతో షర్మిల మాట్లాడిన మాటలు విన్నతర్వాత అందరికీ అలాగే అనిపిస్తోంది. మీడియాతో షర్మిల మాట్లాడుతు తన తండ్రి వైఎస్సార్ ను కుట్రచేసి చంపినట్లుగానే తనను కూడా చంపేస్తారేమో అని అన్నారు. తాను పులిబిడ్డనని తాను ఎవరికీ భయపడేది లేదని పదే పదే చెప్పారు.
షర్మిల వ్యాఖ్యలపై జనాల్లో రెండు ప్రశ్నలు మొదలయ్యాయి. అవేమిటంటే వైఎస్సార్ హత్యకు ఎవరు కుట్రపన్నారు ? దాన్ని ఎవరు అమలుచేశారు ? కుట్రచేసి హత్యచేశారని ఆరోపణలు చేస్తే సరిపోదు. కుట్రపన్నింది ఎవరు ? హత్యచేసింది ఎవరనే విషయాలను కూడా షర్మిలే చెప్పాల్సుంటుంది. 2009లో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లోనే దీన్ని హత్యాగా వైఎస్ కుటుంబసభ్యులే అనుమానం వ్యక్తంచేశారు.
అయితే వైఎస్ మరణంపై నియమించిన కమిటి ఎలాంటి కుట్ర జరగలేదని కేవలం వాతావరణంలో మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది. దాంతో వైఎస్ మరణం హత్యంటు మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత షర్మిల ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. సరే వైఎస్సార్ విషయాన్ని వదిలేస్తే షర్మిలను చంపటానికి ఎవరు కుట్రచేస్తారు ? ఎవరికి అవసరం ?
ఇక్కడ గమనించాల్సిందేమంటే షర్మిల తననుతాను చాలాఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనిపిస్తోంది. మీడియా సమావేశంలో బీడీలను చూపించి దమ్ముంటే తనను అరెస్టు చేయండని పదే పదే కేసీయార్ నా చాలెంజ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే కేసీయార్ ను రెచ్చగొట్టి తాను అరెస్టవ్వటం ద్వారా జనాల సానుభూతిని పొందాలని షర్మిల అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుట్రచేసి హత్యచేశారు, తనను కూడా హత్యచేస్తారేమో అనే వ్యాఖ్యలన్నీ సానుభూతి కోసమే అని అర్ధమవుతోంది. మరి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో ?
This post was last modified on September 19, 2022 12:28 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…