Political News

పులి బిడ్డ సెంటిమెంటును ప్రయోగిస్తోందా ?

వేరేదారి లేక వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చివరకు సెంటిమెంటునే అస్త్రంగా ప్రయోగిస్తున్నారా ? ఇపుడిదే సందేహం అందరిలోను పెరిగిపోతోంది. తాజాగా మీడియాతో షర్మిల మాట్లాడిన మాటలు విన్నతర్వాత అందరికీ అలాగే అనిపిస్తోంది. మీడియాతో షర్మిల మాట్లాడుతు తన తండ్రి వైఎస్సార్ ను కుట్రచేసి చంపినట్లుగానే తనను కూడా చంపేస్తారేమో అని అన్నారు. తాను పులిబిడ్డనని తాను ఎవరికీ భయపడేది లేదని పదే పదే చెప్పారు.

షర్మిల వ్యాఖ్యలపై జనాల్లో రెండు ప్రశ్నలు మొదలయ్యాయి. అవేమిటంటే వైఎస్సార్ హత్యకు ఎవరు కుట్రపన్నారు ? దాన్ని ఎవరు అమలుచేశారు ? కుట్రచేసి హత్యచేశారని ఆరోపణలు చేస్తే సరిపోదు. కుట్రపన్నింది ఎవరు ? హత్యచేసింది ఎవరనే విషయాలను కూడా షర్మిలే చెప్పాల్సుంటుంది. 2009లో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లోనే దీన్ని హత్యాగా వైఎస్ కుటుంబసభ్యులే అనుమానం వ్యక్తంచేశారు.

అయితే వైఎస్ మరణంపై నియమించిన కమిటి ఎలాంటి కుట్ర జరగలేదని కేవలం వాతావరణంలో మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది. దాంతో వైఎస్ మరణం హత్యంటు మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత షర్మిల ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. సరే వైఎస్సార్ విషయాన్ని వదిలేస్తే షర్మిలను చంపటానికి ఎవరు కుట్రచేస్తారు ? ఎవరికి అవసరం ?

ఇక్కడ గమనించాల్సిందేమంటే షర్మిల తననుతాను చాలాఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనిపిస్తోంది. మీడియా సమావేశంలో బీడీలను చూపించి దమ్ముంటే తనను అరెస్టు చేయండని పదే పదే కేసీయార్ నా చాలెంజ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే కేసీయార్ ను రెచ్చగొట్టి తాను అరెస్టవ్వటం ద్వారా జనాల సానుభూతిని పొందాలని షర్మిల అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుట్రచేసి హత్యచేశారు, తనను కూడా హత్యచేస్తారేమో అనే వ్యాఖ్యలన్నీ సానుభూతి కోసమే అని అర్ధమవుతోంది. మరి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో ?

This post was last modified on September 19, 2022 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

11 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

50 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago