Political News

జనసేనలో చేరనున్న వైసీపీ నేత

తూర్పుగోదావరి జిల్లాలోని అధికార పార్టీ సీనియర్ నేత జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు తొందరలోనే జనసేనలో చేరబోతున్నారట. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఒక పార్టీకి రాజీనామా చేసిన నేత మరోపార్టీలో చేరటం సహజమే కదా. పైగా ఎన్నికలకు ముందు చేరితే కచ్చితంగా నియోజకవర్గంలో టికెట్ హామీ తీసుకునే రాజీనామా చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రాజోలులో సమస్య ఏమిటంటే 2019 ఎన్నికల్లో జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు. అయితే ఈయన వైసీపీ నేత అయినా టికెట్ దక్కని కారణంగా అప్పటికప్పుడు జనసేనలో చేరారు. టికెట్ తెచ్చుకోవటం, గెలవటం వెంటవెంటనే జరిగిపోయాయి. గెలిచిన తర్వాత రాపాకకు పార్టీలో కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కని కారణంగా ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటినుండి రాపాకు-బొంత మధ్య నియోజకవర్గంతో పాటు పార్టీలో పెద్ద యుద్ధమే నడుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బొంతుకు టికెట్ దక్కేది అనుమానమే అని తెలిసింది. 2014, 19 వరస ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన బొంతు ఓడిపోయారు. అయినా మూడోసారి కూడా తనకే టికెట్ కావాలని బొంతు పట్టుబట్టారు. దానికి జగన్ సాధ్యం కాదన్నట్లున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో రాపాక వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పార్టీలో పరిణామాలను చూసిన తర్వాత ఇక వైసీపీలో ఉండి లాభంలేదని బొంతు డిసైడ్ అయినట్లున్నారు.

అందుకనే ఈమధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా రాజోలులో టికెట్ హామీ తీసుకున్నట్లున్నారు. జనసేనకు కూడా రాజోలులో గట్టి నేత అవసరముంది. అందుకనే పవన్ కూడా బొంతుకు టికెట్ హామీ ఇచ్చినట్లున్నారు. హామీ తీసుకున్న తర్వాతే బొంతు గురువారం వైసీపీకి రాజీనామా చేసినట్లు పార్టీవర్గాలే చెబుతున్నాయి. కాబట్టి తొందరలోనే బొంతు జనసేనలో చేరటం ఖాయమని అంటున్నారు.

This post was last modified on September 16, 2022 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago