దేశం కోటి టెస్టుల మైలురాయిని అధిగమించింది. అదేసమయంలో ఏపీ మిలియన్ టెస్టుల మైలురాయిని అధిగమించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. ఏపీలో మోసం జరుగుతోందని అనుమానపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఏపీలో కరోనా పరీక్షలపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి.
ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ రాగా… ఆయన హైదరాబాదులో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నా ఆయనకు ఇక్కడ నెగెటివ్ వచ్చింది. అపుడే చంద్రబాబు ఏపీలో టెస్టులో నమ్మదగినవి కావని అనుమానం వ్యక్తంచేశారు.
ఏపీలో ఒక వ్యక్తికి కోవిడ్ టెస్టులు చేయకుండానే పాజిటివ్ నిర్దారణ అయినట్లు మెసేజ్ పంపించారు. దీనిపై వైరల్ అవుతున్న వీడియోను చంద్రబాబు షేర్ చేస్తూ ఏపీ సర్కారు తీరుపై విమర్శలు చేశారు. ఏపీలో కరోనా పరీక్షలు వట్టి మాయ అయినా అయుండాలి లేకపోతే కుంభకోణమైనా అయ్యుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉంది, ఇందులో కూడా అదే విధంగా మోసం చేస్తుందని ఆరోపించారు. కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంత నీచానికి దిగజారడం ఏంటి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
This post was last modified on July 6, 2020 9:50 pm
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు.…
హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న…
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు…
టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో…
34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో…
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు…