దేశం కోటి టెస్టుల మైలురాయిని అధిగమించింది. అదేసమయంలో ఏపీ మిలియన్ టెస్టుల మైలురాయిని అధిగమించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. ఏపీలో మోసం జరుగుతోందని అనుమానపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఏపీలో కరోనా పరీక్షలపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి.
ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ రాగా… ఆయన హైదరాబాదులో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నా ఆయనకు ఇక్కడ నెగెటివ్ వచ్చింది. అపుడే చంద్రబాబు ఏపీలో టెస్టులో నమ్మదగినవి కావని అనుమానం వ్యక్తంచేశారు.
ఏపీలో ఒక వ్యక్తికి కోవిడ్ టెస్టులు చేయకుండానే పాజిటివ్ నిర్దారణ అయినట్లు మెసేజ్ పంపించారు. దీనిపై వైరల్ అవుతున్న వీడియోను చంద్రబాబు షేర్ చేస్తూ ఏపీ సర్కారు తీరుపై విమర్శలు చేశారు. ఏపీలో కరోనా పరీక్షలు వట్టి మాయ అయినా అయుండాలి లేకపోతే కుంభకోణమైనా అయ్యుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉంది, ఇందులో కూడా అదే విధంగా మోసం చేస్తుందని ఆరోపించారు. కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంత నీచానికి దిగజారడం ఏంటి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
This post was last modified on July 6, 2020 9:50 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…