ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన.. ఏపీలోని అరకు గిరిజన పార్లమెంటు నియోజకవర్గం మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకురాలు.. కొత్తపల్లి గీత, ఆమె భర్తను సైతం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత.. హైదరాబాద్లోని నివాసంలోనే అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. ఆ వెంటనే వారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి ఆమెను తరలించారు.
గీత, ఆమె భర్తను ఏకకాలంలో అరెస్టు చేయడం రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. గతంలోనే ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విశ్వేశ్వర ఇన్ ఫ్రా పేరుతో రూ.50 కోట్ల మేర రుణం తీసుకొని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. దీనిపై గత రెండేళ్ల కిందటే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి విచారణలో ఉన్న ఈ కేసులో సీబీఐ ఒక్కసారిగా వేగం పెంచింది.
ఈ క్రమంలో అన్నీ విచారించుకుని గీత దంపతులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, తక్షణ బెయిల్ కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో విచారించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత.. ఈ పిటిషన్ విచారణకు రానుంది.
ఇక, గీతపై ఈ ఒక్కటే కాదు.. గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లోని దుర్గంచెరువు ప్రాంతంలో ఆర్డీవోగా పనిచేసిన గీత.. అక్కడ ఒక భూమిని కబ్జా చేశారనే కేసు ఉంది. ఈ క్రమంలో ఆమె భర్తకు సైతం తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు కూడా విచారణ దశలోనే ఉంది. ఇక, రాజకీయంగా కూడా ఆమె ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. వైసీపీతో అరంగేట్రం చేసిన ఆమె 2014లో అరకు నుంచి విజయం దక్కించుకున్నారు.
అయితే.. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో గెలిచిన తర్వాత.. కనీసం పార్టీ అధినేత జగన్కు మొహం కూడా చూపించకుండానే.. సర్వతంత్ర స్వతంత్రంగా ఆమె వ్యవహరించారు. తర్వాత.. టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అది సాగలేదు. బీజేపీ కండువా కప్పుకోవాలని అనుకున్నారు. అది కూడా వీలు పడలేదు. దీంతో సొంతగా పార్టీ పెట్టుకున్నారు. అది కూడా సక్సెస్ కాకపోవడంతో .. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో గీత అరెస్టు సంచలనంగా మారింది.
This post was last modified on September 14, 2022 2:22 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…