ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన.. ఏపీలోని అరకు గిరిజన పార్లమెంటు నియోజకవర్గం మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకురాలు.. కొత్తపల్లి గీత, ఆమె భర్తను సైతం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత.. హైదరాబాద్లోని నివాసంలోనే అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. ఆ వెంటనే వారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి ఆమెను తరలించారు.
గీత, ఆమె భర్తను ఏకకాలంలో అరెస్టు చేయడం రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. గతంలోనే ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విశ్వేశ్వర ఇన్ ఫ్రా పేరుతో రూ.50 కోట్ల మేర రుణం తీసుకొని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. దీనిపై గత రెండేళ్ల కిందటే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి విచారణలో ఉన్న ఈ కేసులో సీబీఐ ఒక్కసారిగా వేగం పెంచింది.
ఈ క్రమంలో అన్నీ విచారించుకుని గీత దంపతులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, తక్షణ బెయిల్ కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో విచారించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత.. ఈ పిటిషన్ విచారణకు రానుంది.
ఇక, గీతపై ఈ ఒక్కటే కాదు.. గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లోని దుర్గంచెరువు ప్రాంతంలో ఆర్డీవోగా పనిచేసిన గీత.. అక్కడ ఒక భూమిని కబ్జా చేశారనే కేసు ఉంది. ఈ క్రమంలో ఆమె భర్తకు సైతం తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు కూడా విచారణ దశలోనే ఉంది. ఇక, రాజకీయంగా కూడా ఆమె ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. వైసీపీతో అరంగేట్రం చేసిన ఆమె 2014లో అరకు నుంచి విజయం దక్కించుకున్నారు.
అయితే.. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో గెలిచిన తర్వాత.. కనీసం పార్టీ అధినేత జగన్కు మొహం కూడా చూపించకుండానే.. సర్వతంత్ర స్వతంత్రంగా ఆమె వ్యవహరించారు. తర్వాత.. టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అది సాగలేదు. బీజేపీ కండువా కప్పుకోవాలని అనుకున్నారు. అది కూడా వీలు పడలేదు. దీంతో సొంతగా పార్టీ పెట్టుకున్నారు. అది కూడా సక్సెస్ కాకపోవడంతో .. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో గీత అరెస్టు సంచలనంగా మారింది.
This post was last modified on September 14, 2022 2:22 pm
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…