రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్న మత ప్రభోదకుడు కేఏ పాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీ గుర్తింపును కమీషన్ రద్దు చేసింది. దేశంలో క్రియాశీలంగా లేని రాజకీయ పార్టీలను కమీషన్ గుర్తించింది. 537 పార్టీలు పేరుకు మాత్రమే ఉనికిలో ఉన్నాయని నిజానికి వాటి తరపున ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదని నిర్ధారణకు వచ్చింది. ఇలాంటి పార్టీలన్నింటినీ ఒకే దెబ్బతో గుర్తింపు రద్దు చేసేసింది.
కమీషన్ దెబ్బకు గుర్తింపు కోల్పోయిన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో 20 దాకా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో జనాలకు కాస్త తెలిసిన పార్టీ కేఏ పాల్ ఏర్పాటుచేసిన ప్రజాశాంతిపార్టీ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తానని ఒకసారి, ఏపీలో తమదే అధికారం అని మరోసారి మీడియాతో పాల్ ఎన్నో సార్లు చెప్పారు. పాల్ మీడియా సమావేశాలంటే జర్నలిస్టులకు పెద్ద రిలీఫ్ లాగ ఫీలవుతారు. 24 గంటలూ టెన్షన్లో ఉండే జర్నలిస్టులకు పాల్ కాసింత వినోదాన్ని పంచుతుంటారు.
ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తన పార్టీలో కలిపేయమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు తనతో చేతులు కలిపితే అధికారంలోకి ఈజీగా వస్తారంటు ఊదరగొట్టారు. తాను ముఖ్యమంత్రి అయితే ఏపీకి లక్షల కోట్ల రూపాయలను తీసుకొచ్చి నెలల వ్యవధిలోనే డెవలప్ చేసి చూపిస్తానని ఎన్నోసార్లు చెప్పారు. అలాగే తెలంగాణాలో డెవలప్ చేయటం కేసీయార్ వల్ల కాలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాత్రమే తనదే అంటు పదే పదే చెప్పారు. ఇపుడే తనతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి రావచ్చని మిగిలిన పార్టీలకు బంపరాఫర్ కూడా ఇచ్చారు. తానేమిటో, తన పార్టీ ఏమిటో తెలుసుకోకుండానే జనాల దృష్టిలో తనకు ఎలాంటి ఇమేజి ఉందో కూడా పాల్ ఏరోజూ చూసుకోలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్న పాల్ పార్టీని కమీషన్ ఏకంగా రద్దుచేయటంతో ఇక ఆయన సీఎం ఎలాగవుతారో ఏమిటో ?
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…