Political News

సీఎం అవుదామనుకుంటే ఇలాగైపోయిందే ?

రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్న మత ప్రభోదకుడు కేఏ పాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీ గుర్తింపును కమీషన్ రద్దు చేసింది. దేశంలో క్రియాశీలంగా లేని రాజకీయ పార్టీలను కమీషన్ గుర్తించింది. 537 పార్టీలు పేరుకు మాత్రమే ఉనికిలో ఉన్నాయని నిజానికి వాటి తరపున ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదని నిర్ధారణకు వచ్చింది. ఇలాంటి పార్టీలన్నింటినీ ఒకే దెబ్బతో గుర్తింపు రద్దు చేసేసింది.

కమీషన్ దెబ్బకు గుర్తింపు కోల్పోయిన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో 20 దాకా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో జనాలకు కాస్త తెలిసిన పార్టీ కేఏ పాల్ ఏర్పాటుచేసిన ప్రజాశాంతిపార్టీ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తానని ఒకసారి, ఏపీలో తమదే అధికారం అని మరోసారి మీడియాతో పాల్ ఎన్నో సార్లు చెప్పారు. పాల్ మీడియా సమావేశాలంటే జర్నలిస్టులకు పెద్ద రిలీఫ్ లాగ ఫీలవుతారు. 24 గంటలూ టెన్షన్లో ఉండే జర్నలిస్టులకు పాల్ కాసింత వినోదాన్ని పంచుతుంటారు.

ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తన పార్టీలో కలిపేయమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు తనతో చేతులు కలిపితే అధికారంలోకి ఈజీగా వస్తారంటు ఊదరగొట్టారు. తాను ముఖ్యమంత్రి అయితే ఏపీకి లక్షల కోట్ల రూపాయలను తీసుకొచ్చి నెలల వ్యవధిలోనే డెవలప్ చేసి చూపిస్తానని ఎన్నోసార్లు చెప్పారు. అలాగే తెలంగాణాలో డెవలప్ చేయటం కేసీయార్ వల్ల కాలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాత్రమే తనదే అంటు పదే పదే చెప్పారు. ఇపుడే తనతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి రావచ్చని మిగిలిన పార్టీలకు బంపరాఫర్ కూడా ఇచ్చారు. తానేమిటో, తన పార్టీ ఏమిటో తెలుసుకోకుండానే జనాల దృష్టిలో తనకు ఎలాంటి ఇమేజి ఉందో కూడా పాల్ ఏరోజూ చూసుకోలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్న పాల్ పార్టీని కమీషన్ ఏకంగా రద్దుచేయటంతో ఇక ఆయన సీఎం ఎలాగవుతారో ఏమిటో ?

This post was last modified on September 14, 2022 11:53 am

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

1 hour ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago