Political News

జగన్ ఆలోచన ఫెయిలైందా ?

ప్రతి నియోజకవర్గం నుంచి సరైన ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఫెయిలైనట్లే అనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది కార్యకర్తలతో భేటీ అవ్వాలని జగన్ ఆలోచించారు. నియోజకవర్గంలో జనాభిప్రాయం ఎలాగుంది ? ప్రభుత్వం పనితీరు ఎలాగుంది ? పార్టీలో సమస్యలు ఏమిటి ? వాటికి కారణాలు+పరిష్కారాలను కనుక్కునేందుకు జగన్ సమావేశాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

అనుకున్నట్లుగా కుప్పం, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ ఉద్దేశ్యం మాత్రం నెరవేరలేదని సమాచారం. ఎందుకంటే తమ నియోజకవర్గం ఎంఎల్ఏని లేదా మంత్రిని సమావేశంలో జగన్ కూర్చోబెట్టుకుని మాట్లాడమంటే కార్యకర్తలు స్వేచ్చగా ఎలా మాట్లాడగలరు ? మంత్రిపైనో లేదా ఎంఎల్ఏ పైనే ఏమైనా ఫిర్యాదులు చేయాలంటే ఎలా చేయగలరు ? మంత్రి, ఎంఎల్ఏ ఆలోచనలకు భిన్నంగా కార్యకర్తలు జగన్ కు ఏమని చెప్పగలరు ?

ఈ సమస్యలన్నీ ఒకవైపుండగానే మరోవైపు కార్యకర్తలు మాట్లాడటానికి జగన్ పెద్దగా అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. కార్యకర్తలు ఎలా పనిచేయాలి ? పార్టీని ఎలా గెలిపించాలనే విషయాలపై జగన్ ఉపన్యాసాలిచ్చారు. ఉపన్యాసాలు ఇవ్వటానికి ప్రత్యేకంగా 50 మంది కార్యకర్తలను తన దగ్గరకు పిలిపించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రత్యేకించి కార్యకర్తలను పిలిపించుకున్నారంటే వాళ్ళనుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్ బ్యాక్ తీసుకోవాలంటే వాళ్ళతో మాట్లాడించాలి జగన్ వినాలంతే.

నియోజకవర్గం ఇన్చార్జో లేదా ఎంఎల్ఏ, మంత్రిని భేటీకి పిలవకూడదు. వాళ్ళు లేకుండానే జగన్ కార్యకర్తలతో భేటీ అవ్వాలి. అప్పుడే తాము చెప్పదలచుకున్న విషయాలను కార్యకర్తలు స్వేచ్చగా చెప్పగలరు. ఇలా జరగలేదు కాబట్టే కార్యకర్తలతో భేటీల ఆలోచన ఫెయిలైనట్లుంది. ఇలాంటి భేటీల వల్ల సమయం దండగ అని అనుకున్నట్లున్నారు. కొద్దిరోజులుగా ఇలాంటి భేటీలు నిర్వహించటం లేదు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఆర్భాటంగా కార్యక్రమాన్ని ప్రకటించటం, మధ్యలోనే ముగించేయటం జగన్ కు అవసరమా ?

This post was last modified on September 13, 2022 12:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

6 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago