Political News

వైసీపీ నేత‌ల‌ను ‘క‌దిలించే’ మంత్రం ఇదేనా..!


ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో నాయ‌కులు చెబుతున్న మాట ఇదే! ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ఎంత ఆదేశించినా.. ఎన్ని సార్లు హెచ్చ‌రించినా.. నాయ‌కుల మ‌ధ్య చైత‌న్యం క‌ల‌గ‌డం లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు సుప్త‌చేత‌నావ‌స్థ‌ను వీడ‌లేక .. నిద్ర‌బ‌ద్ధ‌కాన్ని వ‌దిలించుకోలేక పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నారు. మీరు జ‌నాల్లో ఉండ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఉండ‌ద‌ని.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కుల మ‌ధ్య చ‌ల‌నం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఏదో కొద్దిమంది మాత్ర‌మే.. అది కూడా మొక్కుబ‌డిగా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. తాజాగా.. ఇదే విష‌యంపై పార్టీకి నివేదిక అందింది. నాయ‌కులు..ఏదో మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. మ‌న‌స్పూర్తిగా ఉండ‌డం లేదేని.. ప్ర‌జ‌ల‌కు నేత‌ల‌కు మ‌ధ్య అదే గ్యాప్ కొన‌సాగుతోంద‌ని.. స‌మాచారం అందింది. దీంతో జ‌గ‌న్ ఈ విష‌యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఈ సారి ఆయ‌న ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేయాల‌ని భావించ‌డం లేదు. ఇప్పటి వ‌ర‌కు క‌ద‌ల‌ని నాయ‌కుల‌ను క‌దిలించే మంత్రం ఒక‌టి వేశార‌ని.. అంటున్నారు. అదే.. ప్ర‌జ‌ల్లో ఉన్న నాయ‌కులు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం చేప‌డుతున్న నాయ‌కుల‌కు.. చెందిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. ఈ నెల ఆఖ‌రులో అభివృద్ధి నిధులు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు రూ.2 కోట్ల వంతున ప్ర‌భుత్వం ఇస్తుంద‌న్న‌మాట‌.

ఇది.. గ‌తంలో ప్ర‌క‌టించిన విధాన‌మే. అయితే.. అప్ప‌ట్లో అంద‌రికీ ఈ నిధులు ఇస్తామ‌ని.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా నిధులు ఇస్తామ‌న్నారు. అయితే.. ఇప్పుడు.. వ్యూహం మార్చుకుని అంద‌రికీ కాకుండా.. ప‌నిచేసేవారికి మాత్ర‌మే.. నిధులు ఇవ్వాల‌ని.. నిర్ణ‌యించిన ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. ఇది క‌నుక జ‌రిగితే.. అప్పుడు ఇక‌, అంద‌రూ… ముందుకు వస్తారని.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటార‌ని.. పైకి మాట‌లు ఎన్ని చెప్పినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఒక‌టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ మంత్రం ఏమేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి.

This post was last modified on September 10, 2022 5:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

34 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago