ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో నాయకులు చెబుతున్న మాట ఇదే! ప్రస్తుతం సీఎం జగన్ ఎంత ఆదేశించినా.. ఎన్ని సార్లు హెచ్చరించినా.. నాయకుల మధ్య చైతన్యం కలగడం లేదనేది అందరికీ తెలిసిందే. ఎక్కడికక్కడ నాయకులు సుప్తచేతనావస్థను వీడలేక .. నిద్రబద్ధకాన్ని వదిలించుకోలేక పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నారు. మీరు జనాల్లో ఉండకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు.
అయినప్పటికీ.. నాయకుల మధ్య చలనం పెద్దగా కనిపించడం లేదు. ఏదో కొద్దిమంది మాత్రమే.. అది కూడా మొక్కుబడిగా.. ప్రజల మధ్య ఉంటున్నారు. తాజాగా.. ఇదే విషయంపై పార్టీకి నివేదిక అందింది. నాయకులు..ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని.. మనస్పూర్తిగా ఉండడం లేదేని.. ప్రజలకు నేతలకు మధ్య అదే గ్యాప్ కొనసాగుతోందని.. సమాచారం అందింది. దీంతో జగన్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఈ సారి ఆయన ఎలాంటి హెచ్చరికలు చేయాలని భావించడం లేదు. ఇప్పటి వరకు కదలని నాయకులను కదిలించే మంత్రం ఒకటి వేశారని.. అంటున్నారు. అదే.. ప్రజల్లో ఉన్న నాయకులు.. గడప గడపకు కార్యక్రమం చేపడుతున్న నాయకులకు.. చెందిన నియోజకవర్గాలకు.. ఈ నెల ఆఖరులో అభివృద్ధి నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే.. ఆయా నియోజకవర్గాలకు రూ.2 కోట్ల వంతున ప్రభుత్వం ఇస్తుందన్నమాట.
ఇది.. గతంలో ప్రకటించిన విధానమే. అయితే.. అప్పట్లో అందరికీ ఈ నిధులు ఇస్తామని.. జగన్ ప్రకటన చేశారు. ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు.. వ్యూహం మార్చుకుని అందరికీ కాకుండా.. పనిచేసేవారికి మాత్రమే.. నిధులు ఇవ్వాలని.. నిర్ణయించిన ట్టు తాడేపల్లి వర్గాల టాక్. ఇది కనుక జరిగితే.. అప్పుడు ఇక, అందరూ… ముందుకు వస్తారని.. ప్రజల మధ్య ఉంటారని.. పైకి మాటలు ఎన్ని చెప్పినా.. ప్రయోజనం లేదని.. ఒకటాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ మంత్రం ఏమేరకు పనిచేస్తుందో చూడాలి.
This post was last modified on September 10, 2022 5:57 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…