Political News

అమ‌రావ‌తిపై మ‌రో గంద‌ర‌గోళం.. ప్ర‌భుత్వం ఏం చేసిందంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమరావతి విషయంలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి వ్య‌తిరేకంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మూడు రాజ‌ధానులు అంటూ తెర‌మీదికి తెచ్చి.. ఇక్క‌డి రైతుల‌తో క‌న్నీరు పెట్టించింది. ఇప్పుడు ఇదే ప‌రంపర‌లో మరో గందరగోళానికి తెరలేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామపంచాయతీలతో.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది.

దీని ప్ర‌కారం.. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రాజధాని పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. గతంలో 19 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను.. అన్ని గ్రామాల్లోని ప్రజలు తిరస్కరించారు.

సీఆర్డీఏ చట్టంలోని 29గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటీ దిశగా చర్యలు చేపట్టింది. నోటీసులు అందుకున్న 10రోజుల్లోగా అభ్యంతరాల ప్రక్రియ పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

నిర్దేశించిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. గతంలో తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు రాజధాని పరిధిలో లేవు. ఇప్పుడు వాటిని కూడా కలిపి అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. మునిసిపాలిటీ ఏర్పాటుపై రైతులు ఎలా రియాక్ట్ అవుతార‌నేది చూడాలి. ఏదేమైనా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేవ‌ర‌కు అమ‌రావ‌తిపై గంద‌రగోళం తొలిగిపోద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on September 9, 2022 8:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Amaravati

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

3 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

5 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

9 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

10 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

11 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

11 hours ago