Political News

గుజ‌రాత్‌లో రాహుల్ హామీలే హామీలు..

కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. దీనిని గ‌ట్టెక్కించే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మ‌రిన్ని ఆయుధాలు అందించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జాతీయ స్థాయి పార్టీని ఆయ‌న ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌ను ఆయ‌న టార్గెట్ చేసుకున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లం గ‌త పాతికేళ్లుగా ఏమీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. 27 సంవ‌త్స‌రాలుగా ఇక్కడ బీజేపీ పాల‌న సాగుతోంది.

ఈ క్ర‌మంలో రాహుల్‌.. తాజాగా జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. అయితే.. ఆయ‌న స్థానికంగా ఉన్న స‌మ‌స్యలను ప్ర‌స్తావించి.. హామీలు ఇస్తే.. స‌రిపోయేది.. కానీ, జాతీయ స్థాయిలో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వాటిని ప్రాంతీయ స్థాయికి ముడిపెట్టి గుజ‌రాతీల‌కు హామీలు గుప్పించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ ప్రకటించారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.

ఈ మూడు హామీలు కూడా దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప్ర‌క‌టించి ఉంటే బాగుండేది. కానీ, రాష్ట్ర స్థాయిలో ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. అదే స‌మ‌యంలో పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 సబ్సిడీ ఇస్తామని రాహుల్ ప్ర‌క‌టించారు. బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పారు. 3 వేల ఆంగ్ల మాద్యమ పాఠశాలలు నిర్మిస్తామని.. బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.

ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ పటేల్ ఎవరి కోసమైతే పోరాడారో, ఏ ప్రజల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో వారికే అది వ్యతిరేకంగా పనిచేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రవేశ పెట్టి రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు.. రైతుల హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయన్నారు. గుజరాత్లోని ప్రతి సంస్థను బీజేపీ స్వాధీనం చేసుకుందని.. ఇక్కడ యుద్ధం రెండు పార్టీల మధ్య కాదు, అధికార పక్షం స్వాధీనం చేసుకున్న ప్రతి సంస్థతో అని ఆయన ఆరోపించారు. ఏదేమైనా.. రాహుల్ వంటి నాయ‌కులు హామీ ఇస్తే.. అది దేశం మొత్తాన్ని ప్ర‌భావితం చేసేలా ఉండాలి కానీ.. ఇలా ప్రాంతీయ రాజ‌కీయాల‌పై కాద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. రేపు ఇవే హామీల‌ను దేశం మొత్తానికి ఇచ్చే సాహ‌సం.. చేయ‌గ‌లరా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

1 hour ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago