కండల వీరుడు సల్మాన్ ఖాన్ విక్టరీ వెంకటేష్ తొలిసారి కలిసి నటిస్తున్న కిసీకో భాయ్ కిసీకో జాన్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీడియో బయటికి రావడం ఆలస్యం వెంటనే ట్రోలింగ్ మొదలైపోయింది. కారణం లేకపోలేదు. సల్మాన్ జుత్తు మరీ కృత్రిమంగా ఉండటం, ఏదో స్టైలిష్ గా కనపడాలనే తాపత్రయం తప్ప నిజంగా ఆ పాత్ర అలాంటి డిమాండ్ చేసిందాని అనుమానం వచ్చేలా డిజైన్ చేశారు. అంతే ఇదేం జుత్తు భాయ్ అంటూ నెటిజెన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడో తేరే నామ్ తర్వాత సల్లు భాయ్ జులపాలతో కనిపించలేదు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేష్ ఆమె అన్నయ్యగా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ముందు కభీ ఈద్ కభీ దీవాలి టైటిల్ అనుకుని ఫైనల్ గా కొత్తదానికి లాక్ అయ్యారు. ఈ సినిమా వెనుక పలు ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ముంబై మీడియా ప్రకారం మూల కథ అజిత్ వీరం నుంచి తీసుకున్నారట. అంటే దీన్ని రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు లైన్ అన్నమాట. కొద్దిమార్పులతో బాలీవుడ్ ఆడియన్స్ అభిరుచులకు తగినట్టు దర్శకుడు ఫహద్ సంజి కొత్తగా ఏదో ట్రై చేశారట. అవేంటనేది డిసెంబర్ లో రిలీజైతే కానీ క్లారిటీ రాదు.
ఈయనే అక్షయ్ కుమార్ తో గద్దలకొండ గణేష్ రీమేక్ ని బచ్చన్ పాండేగా చెడగొట్టింది.మరి ఇప్పుడు సల్మాన్ వెంకీ ఇద్దరికీ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్ వచ్చినప్పుడు సైతం ఆ వీడియో చివర్లో సల్లు భాయ్ ఫేస్ ని విఎఫ్ఎక్స్ లో చూపించడం కామెంట్స్ కి దారి తీసింది. ఇప్పుడీ కిసీకా భాయ్ కిసీకా జాన్ వంతు వచ్చింది. అన్నట్టు ఇందులో జగపతిబాబు కూడా ఉన్నాడండోయ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ తో కంపోజ్ చేయిస్తున్నారు. ఒక పాట దేవిశ్రీ ప్రసాద్ కి ఇచ్చి మిగిలినవి మరో ముగ్గురు కంపోజర్స్ తో కొట్టిస్తున్నారు.
This post was last modified on September 6, 2022 2:04 pm
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…