కొన్ని విషయాల్లో రాజకీయ పార్టీలు ముందుండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాదు.. కొన్ని కొన్ని విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే.. వాటిని అంతే బలంగా ముందు నుంచి ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా .. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని, అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న జనసేన గురించే. వచ్చే ఎన్నికల సంగతిని పరిశీలిస్తే.. జనసేనకు ఉన్న బలం అంతంతమాత్రమే.
గత ఎన్నికల్లో తొలిసారి జనసేన రంగంలోకి దిగినప్పుడే.. 143 స్థానాల్లో పోటీకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిలోనూ మెజారిటీ నాయకులు కొత్తవారు. మిగిలిన స్థానాల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక, ఇప్పుడు.. పరిస్థితికి వస్తే.. అదే సీన్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతం కన్నా.. తక్కువగానే.. నాయకులు ఉన్నారు. చాలా మంది మేధావులు పార్టీని వీడిపోయారు. ఎస్సీ, ఎస్టీలు పార్టీలో కనిపించడం కూడా లేరు. బీసీలు ఉన్నా.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు.
ఈ పరిణామాలు.. పార్టీపై ప్రభావం చూపుతున్నాయి. మరో విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతొ పొత్తు పెట్టుకుంటుంది? అనేది చర్చకు వస్తున్న విషయం. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నా.. ఆ పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనసులు కలవని పార్టీలుగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయని.. పార్టీలోనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ విషయంలోనే క్లారిటీ అవసరమని అంటున్నారు.
ఎందుకంటే.. జనసేన అధినేత పవన్పై ఇటు ప్రజల్లోనూ.. అటు పార్టీ నాయకుల్లోనూ చాలా విశ్వసనీయత ఉంది. అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ పొత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఈ విశ్వసనీయతకే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని.. మధ్యలోనే బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ టీడీపీతొ పొత్తు ఉంటుందని కొంత, లేదని కొంత వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలతో జనసేన ఇప్పటికే తొందరపడితే బాగుంటుందని.. పొత్తులపై ఒక క్లారిటీ ఇప్పుడే ఇచ్చేస్తే బెటర్ అని కొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 4, 2022 6:19 pm
ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…
త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…
ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ…