Political News

కేసీఆర్ న‌యా నిజాం: న‌డ్డా కామెంట్స్‌

తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వంటి ఆంక్షలే విధించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై మండిపడ్డారు.

కాకతీయులు ఏలిన వరంగల్‌ గడ్డకు నమస్కారాలు అని తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు. కేసీఆర్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జేపీ నడ్డా ఆరోపించారు. సభకు ముందురోజు అనుమతి రద్దు చేయించారని మండిపడ్డారు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందామని తెలిపారు. పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు.

ఓరుగల్లులో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని జైలును కూల్చారని జేపీ నడ్డా అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మించలేదని మండిపడ్డారు. కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

అందులో అవినీతి చేశారు!

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ను ఏటీఏంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదని ఆగ్రహం వక్తం చేశారు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

This post was last modified on August 27, 2022 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్దికి ఫ్రీ పబ్లిసిటీ

తెలుగులో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు.. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా.. పెద్ది. సంక్రాంతి తర్వాత వెలవెలబోతున్న టాలీవుడ్…

4 minutes ago

ఎన్టీఆర్ నీల్… పెద్ద బరువుని మోయాలి

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్…

45 minutes ago

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…

5 hours ago

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

6 hours ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

6 hours ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

6 hours ago