తెలంగాణలో కేసీఆర్ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కూడా కేసీఆర్ వంటి ఆంక్షలే విధించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో కేసీఆర్పై మండిపడ్డారు.
కాకతీయులు ఏలిన వరంగల్ గడ్డకు నమస్కారాలు అని తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జేపీ నడ్డా ఆరోపించారు. సభకు ముందురోజు అనుమతి రద్దు చేయించారని మండిపడ్డారు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందామని తెలిపారు. పాదయాత్ర చేయకుండా బండి సంజయ్ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు.
ఓరుగల్లులో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని జైలును కూల్చారని జేపీ నడ్డా అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మించలేదని మండిపడ్డారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.
అందులో అవినీతి చేశారు!
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ను ఏటీఏంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదని ఆగ్రహం వక్తం చేశారు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
This post was last modified on August 27, 2022 10:09 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…