కాలం మారుతోంది.. రాజకీయాలు కూడా మారుతున్నాయి. ప్రజల ఇష్టాయిష్టాలు కూడా మారుతున్నాయి. అయితే.. ప్రజల నాడిని పట్టుకుని పయనిస్తున్నపార్టీలు మాత్రం తగ్గుతున్నాయి. ఇప్పుడు.. ఈ చర్చ ఎం దుకు వచ్చిందంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా చూస్తానంటూ.. వ్యాఖ్యానిస్తు న్న పవన్ విషయంలోనే! వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం.. పార్టలో ఆసక్తిగా మారింది. ఏ ప్రాతిపదికన టికెట్లు ఇస్తారు? అనేది చర్చగా మారింది.
ఎందుకంటే.. వైసీపీ వ్యతిరేక ఓటుబ్యాంకును చీల్చకుండా చూడాలంటే.. ఒక్క కాపుల వల్ల మాత్రమే పనికాదు. దీనికి సంబంధించి రెడ్డి సామాజికవర్గం.. బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ.. బీసీ వర్గాలు.. అన్నీ కూడా పవన్కు అనుకూలంగా ఉండి తీరాలి. అదేసమయంలో ఎంపిక చేసే అభ్యర్థుల్లోనూ.. సత్తా ఉండాలి. ఈ విషయాల్లో ఎక్కడ తేడా కొట్టినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పవన్కు పరాభవం తప్పదనే వాదన వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు పైన చెప్పుకొన్నట్టుగా.. ఆయా వర్గాలు… పవన్కు కనెక్ట్ కావడం లేదు.
ఒక్క కాపులు.. యువతలో మాత్రమే పవన్ ఇమేజ్ ఉంది. ఇతర రెడ్డి వర్గం కానీ.. వ్యాపార.. వాణిజ్య , పారి శ్రామికవర్గాలు కానీ.. పవన్ను పక్కన పెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం వ్యూహం లేకపోవడ మే. ఆయా వర్గాలు ఏవీ కూడా.. రాజకీయంగా రాష్ట్రంలో దుమారం కోరుకోవడం.. లేదు. అభివృద్ధిని ఇచ్చే ప్రభుత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న అప్పుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే సర్కా రును మాత్రమే కోరుకుంటున్నారు.
అయితే.. ఈ విషయంలో ప్రజలను కానీ.. ఆయా వర్గాలను కానీ.. మెప్పించడంలో పవన్ విఫలమవుతున్నారు. కేవలం యువతను పట్టుకుని ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. మేధావులను కానీ..ఇతర సామాజిక వర్గాలను కానీ.. ఆయన ఆకర్షించడం లేదు. వారికి అనుకూలంగా ఎలాంటి తీర్మానాలు కూడా ప్రవేశ పెట్టడం లేదు. ఇదిలావుంటే..ఉద్యోగ వర్గాల మాటేంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు.. పవన్ విషయం ఏమో.. కానీ.. ఉద్యోగులే పవన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఇదీ.. సంగతి!!
This post was last modified on August 27, 2022 9:38 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…