దేశంలో ఒకవైపు ధరలు మండిపోతున్నాయి. నిరుద్యోగం తాండవిస్తోంది. ఎక్కడికక్కడ మత ఘర్సణలు.. నిత్యం ఏదో ఒక వివాదం దేశాన్ని పట్టికుదుపుతోంది. దీంతో ప్రతిపక్షాలు.. నిత్యం ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు కురిపిస్తున్నాయి. ఆయన పాలనను ఛీత్కరిస్తున్నాయి. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దింపి తీరాలనే పట్టుదలతో పలు పార్టీల నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ప్రతిపక్షాల వ్యూహాలు ఇలా ఉంటే.. మరోవైపు ప్రజలు మాత్రం.. మోడీకే జై కొడుతుండడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోడీని దేశ ప్రజల్లో 75 శాతం మంది ఆమోదిస్తున్నారని, ఆయన పాలనను మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజా మోదం ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆయన పాలనపై ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నట్టు పేర్కొంది.
మోడీ పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదిం చుకున్నారు మోడీ. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్ ‘ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంలో నిలిచారు.
63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాత స్థానంలో ఉన్నారు.
అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఇక, మోడీని వ్యతిరేకించే వారు ఏం మాట్లాడతారో చూడాలి.
This post was last modified on August 27, 2022 5:43 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…