దేశంలో ఒకవైపు ధరలు మండిపోతున్నాయి. నిరుద్యోగం తాండవిస్తోంది. ఎక్కడికక్కడ మత ఘర్సణలు.. నిత్యం ఏదో ఒక వివాదం దేశాన్ని పట్టికుదుపుతోంది. దీంతో ప్రతిపక్షాలు.. నిత్యం ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు కురిపిస్తున్నాయి. ఆయన పాలనను ఛీత్కరిస్తున్నాయి. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దింపి తీరాలనే పట్టుదలతో పలు పార్టీల నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ప్రతిపక్షాల వ్యూహాలు ఇలా ఉంటే.. మరోవైపు ప్రజలు మాత్రం.. మోడీకే జై కొడుతుండడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోడీని దేశ ప్రజల్లో 75 శాతం మంది ఆమోదిస్తున్నారని, ఆయన పాలనను మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజా మోదం ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆయన పాలనపై ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నట్టు పేర్కొంది.
మోడీ పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదిం చుకున్నారు మోడీ. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్ ‘ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంలో నిలిచారు.
63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాత స్థానంలో ఉన్నారు.
అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఇక, మోడీని వ్యతిరేకించే వారు ఏం మాట్లాడతారో చూడాలి.
This post was last modified on August 27, 2022 5:43 am
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మెగా 158' ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం.…
ఇంకో పన్నెండు రోజుల్లో పెద్ది విడుదల కానుంది. ప్రీమియర్ షోలు ఉంటాయో లేదో, అసలు అప్లై చేశారో లేదోననే క్లారిటీ…
పాకిస్థాన్ దేశంలో మన సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం క్లాష్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు,…
నిన్నటితో కరుప్పు అలియాస్ వీరభద్రుడు 200 కోట్ల గ్రాస్ దాటినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గ్రౌండ్ రియాలిటీలో ఈ…
ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజకీయాల్లో కుదిరే పనికాదు. ఏ విషయాన్నయినా.. సీరియస్గానే తీసుకోవాలి.. సిన్సియర్గానే ఆలోచించాలి. లేకపోతే.. ఇబ్బందులు…