Political News

అన్న క్యాంటీన్ల సెంటిమెంట్‌.. ఏం జరుగుతుందో?

రాష్ట్రంలో పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నాన్ని అతిత‌క్కువ ధ‌ర‌కే అందించే అన్న క్యాంటీన్ల సెంటిమెంటు అధికార పార్టీలోనూ క‌నిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు కూడా అన్న క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు సుమారు ఏడాది ముందు.. అప్ప‌టి సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించారు. రూ.5 కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించేలా.. అక్ష‌య పాత్ర సంస్థ‌తో ఒప్పందం చేసుకుని.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించారు. ఈ కార్య‌క్ర‌మం హిట్ట‌యింది. పేద‌ల‌కు, కార్మికులు.. చేతి వృత్తుల వారు.. హాక‌ర్ల‌కు.. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా.. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆహార ప‌దార్థాలు అందాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ బృందం మొత్తం కూడా.. అన్నా క్యాంటీన్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ప్ర‌చారం చేసింది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అన్నా క్యాంటీన్ల‌ను ఎత్తేసింది. త‌ర్వాత తెరుస్తాం.. అంటూనే.. వీటిని వ‌చ్చిన నాలుగు మాసాల్లోనే మూసేసింది. అప్ప‌టికి అక్షయ పాత్ర సంస్త‌తో చేసుకున్న ఒప్పందం కూడా ముగిసిపోవ‌డంతో వారు కూడా వెళ్లిపోయారు. ఇక‌, అన్న‌క్యాంటీన్ల కోసం.. న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో క‌ట్టించిన బ‌వ‌నాల‌ను.. ప్ర‌స్తుతం స‌చివాల‌యాలుగా వినియోగిస్తున్నారు.

మ‌రికొన్ని చోట్ల ఇప్ప‌టికీ.. ఇవి నిరుప‌యోగంగానే ఉన్నాయి. అయితే.. అన్నా క్యాంటీన్ల సెంటిమెంటును మాత్రం టీడీపీ వ‌దిలి పెట్ట‌లేదు. ఇప్ప‌టికీ.. దానిని లైవ్‌లోనే ఉంచింది. పేద‌లు,, కార్మికులు.. ఇప్ప‌టికీ ఈ క్యాంటీన్ల‌ను గుర్తుకు తెచ్చుకునేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. కుదిరిన చోట ఇటీవ‌ల‌.. మ‌హానాడు అనంత‌రం.. ఇలాంటి క్యాంటీన్ల‌ను తెరిచారు. అయితే.. పోలీసులు అడ్డుకోవ‌డంతో తాత్కాలికంగా మూసేశారు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం ఈ త‌ర‌హా సెంటిమెంటును మాత్రం ఎవ‌రూ తుడిచేయ‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా అన్నా క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల సెంటిమెంటును ప‌సిగ‌డుతున్న నాయ‌కులు.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకున్న అన్న క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు వైసీపీ ఎమ్మెల్యే  వెంక‌ట‌రామిరెడ్డి మునిసిపాలిటీ అధీనంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను లీజుకు తీసుకున్నారు. వైఎస్సార్‌-వైవీఆర్ అన్న క్యాంటీన్ పేరుతో త్వ‌ర‌లోనే దీనిని ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇక్క‌డ రూ.10 కే అన్నీ అందిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.  ఇక‌, మంత్రి రోజా, ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటివారు.. ఇప్ప‌టికే ఈ క్యాంటిన్ల‌ను వివిధ పేర్లతో న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on August 24, 2022 1:33 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

5 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

5 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

6 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

6 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

7 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

7 hours ago