Political News

అన్న క్యాంటీన్ల సెంటిమెంట్‌.. ఏం జరుగుతుందో?

రాష్ట్రంలో పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నాన్ని అతిత‌క్కువ ధ‌ర‌కే అందించే అన్న క్యాంటీన్ల సెంటిమెంటు అధికార పార్టీలోనూ క‌నిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు కూడా అన్న క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు సుమారు ఏడాది ముందు.. అప్ప‌టి సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించారు. రూ.5 కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించేలా.. అక్ష‌య పాత్ర సంస్థ‌తో ఒప్పందం చేసుకుని.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించారు. ఈ కార్య‌క్ర‌మం హిట్ట‌యింది. పేద‌ల‌కు, కార్మికులు.. చేతి వృత్తుల వారు.. హాక‌ర్ల‌కు.. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా.. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆహార ప‌దార్థాలు అందాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ బృందం మొత్తం కూడా.. అన్నా క్యాంటీన్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ప్ర‌చారం చేసింది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అన్నా క్యాంటీన్ల‌ను ఎత్తేసింది. త‌ర్వాత తెరుస్తాం.. అంటూనే.. వీటిని వ‌చ్చిన నాలుగు మాసాల్లోనే మూసేసింది. అప్ప‌టికి అక్షయ పాత్ర సంస్త‌తో చేసుకున్న ఒప్పందం కూడా ముగిసిపోవ‌డంతో వారు కూడా వెళ్లిపోయారు. ఇక‌, అన్న‌క్యాంటీన్ల కోసం.. న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో క‌ట్టించిన బ‌వ‌నాల‌ను.. ప్ర‌స్తుతం స‌చివాల‌యాలుగా వినియోగిస్తున్నారు.

మ‌రికొన్ని చోట్ల ఇప్ప‌టికీ.. ఇవి నిరుప‌యోగంగానే ఉన్నాయి. అయితే.. అన్నా క్యాంటీన్ల సెంటిమెంటును మాత్రం టీడీపీ వ‌దిలి పెట్ట‌లేదు. ఇప్ప‌టికీ.. దానిని లైవ్‌లోనే ఉంచింది. పేద‌లు,, కార్మికులు.. ఇప్ప‌టికీ ఈ క్యాంటీన్ల‌ను గుర్తుకు తెచ్చుకునేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. కుదిరిన చోట ఇటీవ‌ల‌.. మ‌హానాడు అనంత‌రం.. ఇలాంటి క్యాంటీన్ల‌ను తెరిచారు. అయితే.. పోలీసులు అడ్డుకోవ‌డంతో తాత్కాలికంగా మూసేశారు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం ఈ త‌ర‌హా సెంటిమెంటును మాత్రం ఎవ‌రూ తుడిచేయ‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా అన్నా క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల సెంటిమెంటును ప‌సిగ‌డుతున్న నాయ‌కులు.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకున్న అన్న క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు వైసీపీ ఎమ్మెల్యే  వెంక‌ట‌రామిరెడ్డి మునిసిపాలిటీ అధీనంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను లీజుకు తీసుకున్నారు. వైఎస్సార్‌-వైవీఆర్ అన్న క్యాంటీన్ పేరుతో త్వ‌ర‌లోనే దీనిని ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇక్క‌డ రూ.10 కే అన్నీ అందిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.  ఇక‌, మంత్రి రోజా, ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటివారు.. ఇప్ప‌టికే ఈ క్యాంటిన్ల‌ను వివిధ పేర్లతో న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on August 24, 2022 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago