Political News

ఏపీలో చ‌వితి రాజ‌కీయం

ఒక‌ప్పుడు.. కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన వినాయ‌క చ‌వితి వేడుక‌లు.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా.. గ‌ల్లీ నుంచి అన్న‌ట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో ఎక్క‌డైనా వినాయ‌క చ‌వితి పందిళ్లు వేసుకునేందుకు ప‌ర్మిష‌న్లు ఇచ్చేవారు.

అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..క‌రోనా నేప‌థ్యంలో ఈ అనుమ‌తుల‌కు బ్రేక్ ప‌డింద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఇలా రెండేళ్ల‌పాటు.. రాష్ట్రంలో వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌ర‌గ‌లేదు. గ‌త ఏడాది కూడా.. స్వ‌ల్పంగానే అనుమ‌తులు ఇచ్చారు. ఎక్క‌డా భారీ ఎత్తున పందిళ్లు వేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక‌, ఈ ఏడాది క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. పందిళ్లు వేసేందుకు.. యువ‌త ఉత్సాహంగా ఉన్నారు.

అయితే.. ఇప్పుడు కూడా ఏపీ స‌ర్కారు ఆంక్ష‌లు విధించింది. ప్ర‌తి పందిరికి అనుమ‌తులు త‌ప్ప‌ని స‌రి అని పేర్కొంది. అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా.. ఇప్పుడు అగ్నిమాప‌క ద‌ళం నుంచి కూడా అన‌మ‌తులు తెచ్చుకోవాల‌ని సూచించింది. అదేస‌మ‌యంలో చ‌వితికి ఏర్పాటు చేసే పందిళ్ల సైజును బ‌ట్టి.. ఒక్కొక్క పందిరికీ రూ. 1000 గ‌రిష్టంగా ప‌న్ను విధించాల‌ని.. అన్ని మునిసిపాలిటీల‌కు అన‌ధికారిక ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. చెత్త‌ప‌న్ను కూడా విధించ‌నున్నారు.

ఇక‌, పందిళ్ల‌లో లౌడ్ స్పీక‌ర్ల‌పై బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి ఊరేగింపులు.. జ‌ర‌ప‌రాద‌ని.. నిమ‌జ్జ‌న కార్య‌క్రమాల్లో ఎలాంటి లౌడ్ స్పీక‌ర్లు వాడ‌రాద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో ఇది రాజ‌కీయంగా మ‌లుపు తి రిగింది. దీనిపై స్పందించిన‌టీడీపీ..నాయ‌కులు  వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారని మండిప‌డుతున్నారు.

హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే… తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.

This post was last modified on August 24, 2022 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

4 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

4 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

5 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

7 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

7 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

8 hours ago