Political News

ఏపీలో చ‌వితి రాజ‌కీయం

ఒక‌ప్పుడు.. కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన వినాయ‌క చ‌వితి వేడుక‌లు.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా.. గ‌ల్లీ నుంచి అన్న‌ట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో ఎక్క‌డైనా వినాయ‌క చ‌వితి పందిళ్లు వేసుకునేందుకు ప‌ర్మిష‌న్లు ఇచ్చేవారు.

అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..క‌రోనా నేప‌థ్యంలో ఈ అనుమ‌తుల‌కు బ్రేక్ ప‌డింద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఇలా రెండేళ్ల‌పాటు.. రాష్ట్రంలో వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌ర‌గ‌లేదు. గ‌త ఏడాది కూడా.. స్వ‌ల్పంగానే అనుమ‌తులు ఇచ్చారు. ఎక్క‌డా భారీ ఎత్తున పందిళ్లు వేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక‌, ఈ ఏడాది క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. పందిళ్లు వేసేందుకు.. యువ‌త ఉత్సాహంగా ఉన్నారు.

అయితే.. ఇప్పుడు కూడా ఏపీ స‌ర్కారు ఆంక్ష‌లు విధించింది. ప్ర‌తి పందిరికి అనుమ‌తులు త‌ప్ప‌ని స‌రి అని పేర్కొంది. అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా.. ఇప్పుడు అగ్నిమాప‌క ద‌ళం నుంచి కూడా అన‌మ‌తులు తెచ్చుకోవాల‌ని సూచించింది. అదేస‌మ‌యంలో చ‌వితికి ఏర్పాటు చేసే పందిళ్ల సైజును బ‌ట్టి.. ఒక్కొక్క పందిరికీ రూ. 1000 గ‌రిష్టంగా ప‌న్ను విధించాల‌ని.. అన్ని మునిసిపాలిటీల‌కు అన‌ధికారిక ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. చెత్త‌ప‌న్ను కూడా విధించ‌నున్నారు.

ఇక‌, పందిళ్ల‌లో లౌడ్ స్పీక‌ర్ల‌పై బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి ఊరేగింపులు.. జ‌ర‌ప‌రాద‌ని.. నిమ‌జ్జ‌న కార్య‌క్రమాల్లో ఎలాంటి లౌడ్ స్పీక‌ర్లు వాడ‌రాద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో ఇది రాజ‌కీయంగా మ‌లుపు తి రిగింది. దీనిపై స్పందించిన‌టీడీపీ..నాయ‌కులు  వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారని మండిప‌డుతున్నారు.

హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే… తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.

This post was last modified on August 24, 2022 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

25 minutes ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

2 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

7 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

7 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

8 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

8 hours ago