ఒకప్పుడు.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వినాయక చవితి వేడుకలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. గల్లీ నుంచి అన్నట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడైనా వినాయక చవితి పందిళ్లు వేసుకునేందుకు పర్మిషన్లు ఇచ్చేవారు.
అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..కరోనా నేపథ్యంలో ఈ అనుమతులకు బ్రేక్ పడిందనే చెప్పాలి. అప్పట్లో కరోనా విజృంభణ నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేదు. ఇలా రెండేళ్లపాటు.. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు జరగలేదు. గత ఏడాది కూడా.. స్వల్పంగానే అనుమతులు ఇచ్చారు. ఎక్కడా భారీ ఎత్తున పందిళ్లు వేయకుండా చర్యలు తీసుకున్నారు. ఇక, ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో.. పందిళ్లు వేసేందుకు.. యువత ఉత్సాహంగా ఉన్నారు.
అయితే.. ఇప్పుడు కూడా ఏపీ సర్కారు ఆంక్షలు విధించింది. ప్రతి పందిరికి అనుమతులు తప్పని సరి అని పేర్కొంది. అంతేకాదు.. గతానికి భిన్నంగా.. ఇప్పుడు అగ్నిమాపక దళం నుంచి కూడా అనమతులు తెచ్చుకోవాలని సూచించింది. అదేసమయంలో చవితికి ఏర్పాటు చేసే పందిళ్ల సైజును బట్టి.. ఒక్కొక్క పందిరికీ రూ. 1000 గరిష్టంగా పన్ను విధించాలని.. అన్ని మునిసిపాలిటీలకు అనధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు.. చెత్తపన్ను కూడా విధించనున్నారు.
ఇక, పందిళ్లలో లౌడ్ స్పీకర్లపై బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి ఊరేగింపులు.. జరపరాదని.. నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి లౌడ్ స్పీకర్లు వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇది రాజకీయంగా మలుపు తి రిగింది. దీనిపై స్పందించినటీడీపీ..నాయకులు వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.
హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే… తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.
This post was last modified on August 24, 2022 3:49 pm
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…