ఒకప్పుడు.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వినాయక చవితి వేడుకలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. గల్లీ నుంచి అన్నట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడైనా వినాయక చవితి పందిళ్లు వేసుకునేందుకు పర్మిషన్లు ఇచ్చేవారు.
అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..కరోనా నేపథ్యంలో ఈ అనుమతులకు బ్రేక్ పడిందనే చెప్పాలి. అప్పట్లో కరోనా విజృంభణ నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేదు. ఇలా రెండేళ్లపాటు.. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు జరగలేదు. గత ఏడాది కూడా.. స్వల్పంగానే అనుమతులు ఇచ్చారు. ఎక్కడా భారీ ఎత్తున పందిళ్లు వేయకుండా చర్యలు తీసుకున్నారు. ఇక, ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో.. పందిళ్లు వేసేందుకు.. యువత ఉత్సాహంగా ఉన్నారు.
అయితే.. ఇప్పుడు కూడా ఏపీ సర్కారు ఆంక్షలు విధించింది. ప్రతి పందిరికి అనుమతులు తప్పని సరి అని పేర్కొంది. అంతేకాదు.. గతానికి భిన్నంగా.. ఇప్పుడు అగ్నిమాపక దళం నుంచి కూడా అనమతులు తెచ్చుకోవాలని సూచించింది. అదేసమయంలో చవితికి ఏర్పాటు చేసే పందిళ్ల సైజును బట్టి.. ఒక్కొక్క పందిరికీ రూ. 1000 గరిష్టంగా పన్ను విధించాలని.. అన్ని మునిసిపాలిటీలకు అనధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు.. చెత్తపన్ను కూడా విధించనున్నారు.
ఇక, పందిళ్లలో లౌడ్ స్పీకర్లపై బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి ఊరేగింపులు.. జరపరాదని.. నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి లౌడ్ స్పీకర్లు వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇది రాజకీయంగా మలుపు తి రిగింది. దీనిపై స్పందించినటీడీపీ..నాయకులు వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.
హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే… తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.
This post was last modified on August 24, 2022 3:49 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…