Political News

ఏపీలో చ‌వితి రాజ‌కీయం

ఒక‌ప్పుడు.. కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన వినాయ‌క చ‌వితి వేడుక‌లు.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా.. గ‌ల్లీ నుంచి అన్న‌ట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో ఎక్క‌డైనా వినాయ‌క చ‌వితి పందిళ్లు వేసుకునేందుకు ప‌ర్మిష‌న్లు ఇచ్చేవారు.

అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..క‌రోనా నేప‌థ్యంలో ఈ అనుమ‌తుల‌కు బ్రేక్ ప‌డింద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఇలా రెండేళ్ల‌పాటు.. రాష్ట్రంలో వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌ర‌గ‌లేదు. గ‌త ఏడాది కూడా.. స్వ‌ల్పంగానే అనుమ‌తులు ఇచ్చారు. ఎక్క‌డా భారీ ఎత్తున పందిళ్లు వేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక‌, ఈ ఏడాది క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. పందిళ్లు వేసేందుకు.. యువ‌త ఉత్సాహంగా ఉన్నారు.

అయితే.. ఇప్పుడు కూడా ఏపీ స‌ర్కారు ఆంక్ష‌లు విధించింది. ప్ర‌తి పందిరికి అనుమ‌తులు త‌ప్ప‌ని స‌రి అని పేర్కొంది. అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా.. ఇప్పుడు అగ్నిమాప‌క ద‌ళం నుంచి కూడా అన‌మ‌తులు తెచ్చుకోవాల‌ని సూచించింది. అదేస‌మ‌యంలో చ‌వితికి ఏర్పాటు చేసే పందిళ్ల సైజును బ‌ట్టి.. ఒక్కొక్క పందిరికీ రూ. 1000 గ‌రిష్టంగా ప‌న్ను విధించాల‌ని.. అన్ని మునిసిపాలిటీల‌కు అన‌ధికారిక ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. చెత్త‌ప‌న్ను కూడా విధించ‌నున్నారు.

ఇక‌, పందిళ్ల‌లో లౌడ్ స్పీక‌ర్ల‌పై బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి ఊరేగింపులు.. జ‌ర‌ప‌రాద‌ని.. నిమ‌జ్జ‌న కార్య‌క్రమాల్లో ఎలాంటి లౌడ్ స్పీక‌ర్లు వాడ‌రాద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో ఇది రాజ‌కీయంగా మ‌లుపు తి రిగింది. దీనిపై స్పందించిన‌టీడీపీ..నాయ‌కులు  వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారని మండిప‌డుతున్నారు.

హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే… తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.

This post was last modified on August 24, 2022 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

9 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

13 minutes ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

43 minutes ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

60 minutes ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

1 hour ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

2 hours ago