టీడీపీ అధినేత చంద్రబాబు గత 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల వెంట ఉంటే ఈ నియోజకవర్గంపై వైసీపీ కన్నేసింది. దీంతో రాజకీయా్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేమన్నట్టుగా.. ఇక్కడ టీడీపీ పరిస్థితి డోలాయ మానంలో పడిపోయింది. కుప్పంను మినీ మునిసిపాలిటీ చేయడం.. అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం.. ఇటీవలే 66 కోట్ల రూపాయలను సర్కారు ఇస్తామని ప్రకటించడంతో .. కుప్పం వైసీపీలో జోష్ పెరిగింది.
ఇక.. దీనిని చూసిన టీడీపీలోని ఓ వర్గం నాయకులు ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉలిక్కి పడిన తెలుగు తమ్ముళ్లు పరిస్థితిని చక్కదిద్దాలని చంద్ర బాబుకు విన్నవించారు. దీంతో చంద్రబాబు బుధవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు.. కుప్పంలో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఈ పర్యటనలో ఆయన ఏం చేస్తారు? కుప్పంపై ఎలాంటి వ్యూహాన్నిప్రకటిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
నిజం చెప్పాలంటే.. చంద్రబాబు గత 40 ఏళ్ల చరిత్రలో సంక్రాంతి.. దసరా వంటి పండుగల సందర్భంలో నే కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం.. ఆయన పదే పదే కుప్పం బాట పడుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతటితో అయిపోగానే.. ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. కానీ, ఇప్పుడు ఇక్కడ అంతకుమించి ఆయన ఏదైనా చేయాలని తమ్ముళ్లు కోరుతున్నారు. కేవలం పైపై మాటలు కాదు.. ఏదైనా ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఓటమి తర్వాత బాబులో కూడా ఆందోళన అయితే ఉందనే అంటున్నారు.
ఒకవైపు.. వైసీపీ దూకుడు చూపిస్తుంటే.. టీడీపీ మాత్రం పైపైమాటలతో ముందుకు సాగడం సరికాదని ఇక్కడి నాయకుల వాదన. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలపై వైసీపీ కన్నేసి.. తనవైపు తిప్పుకుంటున్న దరిమిలా.. చంద్రబాబు దానికి విరుగుడు మంత్రం వేయాలనేది.. ఇక్కడి నాయకుల ప్రధాన సూచన. ఈ నేపథ్యంలో కుప్పంలో మూడు రోజుల పర్యటనను చంద్రబాబు ఎలా ముగిస్తారనేది ఆసక్తిగా మారింది. చూడాలి.. వైసీపీ నేతలకు వార్నింగులు ఇస్తారో.. పార్టీనేతలను లైన్లో పెడతారో.. అని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 23, 2022 4:34 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…