Political News

ఎంఎల్ఏల్లో మొదలైన టెన్షన్

అధికార పార్టీ ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైందా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక వార్నింగ్ తో చాలామంది ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తను నియమించటమే. మామూలుగా ఎంఎల్ఏలు ఉన్న నియోజకవర్గాలకు వాళ్ళే సమన్వయకర్తలుగా ఉంటున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్ధులనే సమన్వయకర్తలు గా నియమించారు.

అయితే తాడికొండలో వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ శ్రీదేవి ఉండగానే అదనపు సమన్వయకర్తగా ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. సమన్వయకర్తగా ఎంఎల్ఏ ఉన్నపుడు అదనపు సమన్వయకర్తగా మరో నేతను  నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే శ్రీదేవి పనితీరు బాగా లేదని జగన్ కు రిపోర్టులు వచ్చుండచ్చు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని జగన్ అనుకునుండచ్చు. లేదా ఆమె పనితీరును మెరుగుపరుచుకుంటుందున్న ఉద్దేశ్యంతోనే అదనపు సమన్వయ కర్తను నియమించుడచ్చు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పనితీరు మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని జగన్ ఇప్పటికే స్పష్టంగా రెండు మూడు సందర్భాల్లో చెప్పేశారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందే అని ఆదేశించారు. ఇన్నిసార్లు జగన్ చెప్పినా కొందరు యాక్టివ్ గా లేరు. మరికొందరు జనాలతోను, పార్టీ క్యాడర్ తో ను టచ్ లో లేరని ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళని పిలిచి వార్నింగులిస్తున్నా కొందరిలో మార్పు రాలేదటని సమాచారం.

ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఆమె చుట్టూ చాలా వివాదాలున్నాయి. అలాగే ఆమెపై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో ఆమె లాభంలేదని జగన్ భావించి నియోజకవర్గంలో అదనపు సమన్వకర్తను నియమించారు. అంటే తొందరలోనే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తలను నియమించబోతున్నారనే సంకేతాలు వెళ్ళాయి. దాంతో ఏ ఏ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమిస్తారనే విషయంలో చర్చ పెరిగిపోతోంది. ఈ విషయంలోనే ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on August 23, 2022 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago